Don't Miss!
- News సుమలత దెబ్బకు మాజీ సీఎం హడల్, ఇంతవరకు ప్రచారం చెయ్యలేదు, అసలు మ్యాటర్ !
- Sports IPL 2024: చరిత్ర సృష్టించిన సన్రైజర్స్ హైదరాబాద్!
- Technology Whatsapp File Sharing Feature వాట్సాప్లో కొత్త ఫీచర్.. సులభంగా ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు..!
- Lifestyle మీ భార్యతో ఇలా ఎప్పుడైనా ఉన్నారా..? ఆ విషయంలో భర్త తగ్గాల్సిందే..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
ఫొటోలు లీక్ :‘దృశ్యం' రీమేక్ లో కమల్
చెన్నై : మళయాళ,తెలుగు,కన్నడ భాషల్లో విజయవంతమైన దృశ్యం చిత్రాన్ని కమల్ హాసన్ తమిళంలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంభందించిన ఫొటోలు లీక్ అయ్యాయి. ఈ ఫోటోలలో గౌతమి, కమల్ లుక్ లను మీరు గమనించవచ్చు.
తమిళ, కన్నడ, మళయాళ చిత్రాల్లో దృశ్యం టైటిల్ తో తెరకెక్కి విజయవంతమైన చిత్రం ఇప్పుడు తమిళంలోకి వెళ్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో కమల్ హాసన్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రానికి అక్కడ 'దృశ్యం'టైటిల్ తో కాకుండా 'పాపనాశం' అనే టైటిల్ ఖరారు చేశారు. మలయాళ చిత్రానికి దర్శకత్వం వహించిన జీతు జోసఫ్ తమిళ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తారు.
ముచ్చటగా ఉండే ఇద్దరు కూతుళ్లు, మనసెరిగి నడుచుకునే భార్యతో అతగాడి జీవితం సాఫీగా సాగుతుంటుంది. కానీ, పెద్ద కూతురి జీవితంలో రేగిన కలకలంతో ఆ కుటుంబం ఎలా తల్లడిల్లిందనే కథాంశంతో రూపొందిన మలయాళ చిత్రం 'దృశ్యం'. ఏ భాషకైనా నప్పే కథతో రూపొందిన ఈ చిత్రం తెలుగులో వెంకటేశ్, మీనా జంటగా పునర్నిర్మితమై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.
దృశ్యం చిత్రంలో కరప్టెడ్ పోలీస్ కానిస్టేబుల్ పాత్ర కీలకమైంది. ఆ పాత్రను ఎవరూ మర్చిపోలేరు. ఆ పాత్రను ఇప్పుడు తమిళంలో కళాభవన్ మణి పోషించనున్నారు. కమల్ హాసన్ హీరోగా చేస్తున్న దృశ్యం రీమేక్ లో ఈ పాత్రకు గానూ మణిని అడిగినట్లు ఆయన సంతోషంగా డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. కళాభవన్ మణి లాంగ్ గ్యాప్ తర్వాత తమిళంలో చేస్తూండటంతో తనకు ఇది రీఎంట్రీ చిత్రంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మరో ప్రక్క ఇప్పటికే 'దృశ్యం' నిర్మాతలకు బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ లీగల్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. జపనీస్ రచయిత కీగో హిగాషినో రాసిన పుస్తకంలోని విషయాలను కాపీ కొట్టి 'దృశ్యం' చిత్రాన్ని తెరకెక్కించారని ఏక్తా కపూర్ తన నోటీసుల్లో పేర్కొన్నారు. జపనీస్ రచయిత రాసిన 'ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్' పుస్తకం ఆధారంగా సినిమా తెరకెక్కించేందుకు ఏక్తా కపూర్ ఆ పుస్తకం రైట్స్ కొనుగోలు చేసారు. అయితే 'దృశ్యం' చిత్రం చూసిన ఏక్తా కపూర్ అండ్ టీం తాము రైట్స్ దక్కించుకున్న పుస్తకంలోని విషయాలతో 'దృశ్యం' సినిమా ఉండటంతో షాక్కు గురైందట.