Don't Miss!
- Sports DC vs RR: రిషభ్ పంత్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 31 పరుగులు! వీడియో
- News కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హీరోకి ఫుడ్ పాయిజనింగ్...ఫ్యాన్స్ కు టెన్షన్
చెన్నై: ప్రముఖ తమిళ స్టార్ హీరో కార్తీకి ఫుడ్ పాయిజనింగ్ అయ్యింది. దాంతో వెంటనే ఆయన్ని హాస్పటిల్ కు తీసుకువెళ్లి ట్రీట్ మెంట్ చేసారు. ప్రస్తుతం ఆయన సేఫ్ గా ఉన్నారు. అయితే ఈ వార్త ఆయన అభిమానుల్లో ఆందోళన కలిగించింది. సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ఈ విషయమై పోస్ట్ లు ప్రవాహం మొదలైంది. అయితే ఆయన సేఫ్ గా ఉన్నారనే వార్త వచ్చాక అది చల్లబడింది.
ఆ తర్వాత కార్తీ తనపై ఇంత అభిమానం చూపి, తన ఆరోగ్యం కోసం ప్రార్దించినందుకు తన అభిమానులుకు ధాంక్స్ చెప్పుకున్నారు. ఇలాంటి సందర్బాల్లోనే హీరో కు ఉన్న ఫాలోయింగ్ ఎంతన్నది కూడా స్పష్టమవుతూంటుంది అని చెన్నై సినీ వర్గాలు అంటున్నాయి. ఇక కార్తీ... ఈ ఫుడ్ పాయిజనింగ్ తో ..రంజాన్ బిర్యాని మిస్ అవుతున్నారు. ఆయనకు బిర్యాని అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే అదే టైటిల్ తో చిత్రం సైతం చేసారు.
ప్రస్తుతం కార్తీ ..మద్రాస్ చిత్రంతో త్వరలో మనముందకు రావటానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. రీసెంట్ గా 'మద్రాస్ ' ఫస్ట్ లుక్ విడుదలైంది. అట్టకత్తి ఫేమ్ రంజిత్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇంతకుముందు ఈ చిత్రానికి కాళి అండ్ కబాళి అనే టైటిల్ పెట్టారు. కానీ మద్రాస్ టైటిల్ బాగుంటుందని ఖరారు చేసి ఇలా ఫస్ట్ లుక్ వదిలారు.
ఇక ఈ 'మద్రాస్ ' చిత్రం రౌడీయిజం బ్యాక్ డ్రాప్ లో రూపొందింది. నా పేరు శివ తరహాలో ఈ చిత్రం ఆకట్టుకుంటుందని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు. అవారాతో తెలుగులోనూ అదరకొట్టిన కార్తీ ఈ చిత్రాన్ని ఇక్కడా రిలీజ్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక కార్తీ సినిమాలు తెలుగులో వరస ఫ్లాఫులు కావటంతో ఇక్కడ బిజినెస్ సైతం డల్ అయ్యింది.