Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘ఖైదీ’గా రాబోతున్న కార్తి... ఒళ్లుగగుర్బొడిచేలా ఫస్ట్ లుక్!
తమిళ స్టార్ కార్తి త్వరలో ఓ విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కైథి(ఖైదీ) పేరుతో రాబోతున్న ఈ కోలీవుడ్ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ఒళ్లు గగుర్బొడిచే విధంగా ఉంది. జైలు ఊచలు, వాటి వెనక కార్తి ఉన్నట్లు రక్తం థీమ్తో డిఫరెంట్గా డిజైన్ చేశారు.
'కథనం' టీజర్... ఇటు గ్లామర్, అటు యాక్షన్తో అనసూయ కేక!
ఫస్ట్ లుక్ పోస్టర్ ట్విట్టర్ ద్వారా విడుదల చేస్తూ...'ఇది పూర్తి స్థాయి యాక్షన్ థ్రిల్లర్. ఎంతో మంది మంచి యాక్టర్లు, టెక్నీషియన్లతో ఈ సినిమా చేయబోతున్నందుకు సంతోషంగా ఉంది' అని తెలిపారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.
ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ చిత్రంలో కార్తి సరసన హీరోయిన్ ఉండదట. ఈ విషయాన్ని లోకేష్ కనకరాజ్ ఇంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నరేన్, ధీనా, జార్జ్ మరియన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
లోకేష్ కనకరాజ్ 2017లో 'మానగరం' అనే చెన్పై నేపథ్యంలో సాగే థ్రిల్లర్ మూవీతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించి తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కార్తి నటించిన చివరి చిత్రం 'దేవ్' బాక్సాఫీసు వద్ద ఫెయిల్యూర్ అయిన సంగతి తెలిసిందే.