Don't Miss!
- News ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నీది నాదీ ఒకే కథ రీమేక్పై రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన కార్తీ!
నీది నాది ఒకే కథ చిత్రం తమిళ రీమేక్ గురించి మీడియాలో అనేక ఊహగానాలు వస్తున్నాయి. వేణు ఊడుగుల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో శ్రీవిష్ణు, సంతా టైటస్ నటించారు. ఈ చిత్రం టాలీవుడ్లో విమర్శకుల ప్రశంసలతోపాటు మంచి విజయాన్ని అందుకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రీమేక్ హక్కులను భారీ మొత్తాన్ని చెల్లించి ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్ థాను, వీ క్రియేషన్స్ సొంతం చేసుకొన్నారు.
అయితే నీది నాది ఒకే కథ తమిళ రీమేక్ కోసం విలక్షణ నటుడు ధనుష్ను సంప్రదించారనే వార్తలు మీడియాలో షికారు చేశాయి. ఆ తర్వాత ఆ చిత్రంలో కార్తీ నటిస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. అయితే కలైపులి థాను మాత్రం ఈ సినిమా గురించి పెదవి విప్పడం లేదు. ఈ వార్త గురించి మీడియా ప్రశ్నించగా హీరో కార్తీ స్పందించారు.
నీది నాదీ ఒకే కథ చిత్రంలో నటిస్తున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు. ఈ ప్రాజెక్ట్లో నటించాలని ఎవరూ కూడా అడుగలేదు అని కార్తీ ఓ ప్రకటనను విడుదల చేశారు. ప్రస్తుత విద్యావ్యవస్థపై ఓ మధ్య తరగతి యువకుడు చేసిన పోరాటం ఆధారంగా నీది నాదీ ఒకే కథ తెరకెక్కింది.