Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
షాక్ : సీబీ-సీఐడీ ని ఆశ్రయించిన హీరో కార్తీ
సక్సెస్ఫుల్ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, ఇళయరాజా తనయుడు యువన్ శంకర్రాజా చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రం యువన్ శంకర్రాజాకు 100 వ చిత్రం కావడంతో ఆయన ప్రతిష్ఠాత్మకంగా సంగీతాన్ని సమకూర్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 31న యువన్ పుట్టినరోజు కావడంతో అదే రోజున ఆడియోను విడుదల చేసేందుకు చిత్ర నిర్మాత నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్లో బిరియానీ చిత్రంలోని ఎనిమిది పాటలు దర్శనమివ్వడంతో దిక్కుతోచని చిత్ర బృందం సోమవారం స్థానిక గిండీలోని సీబీసీఐడీ కార్యాలయానికి చేరుకుని ఫిర్యాదు చేశారు. చిత్ర హీరో కార్తీ, దర్శకుడు వెంకట్ప్రభు, నిర్మాత జ్ఞానవేల్రాజా, నటుడు ప్రేమ్జీ, సంగీత దర్శకుడు యువన్ శంకర్రాజాలు సీబీసీఐడీ కార్యాలయానికి వచ్చిన వారిలో ఉన్నారు.
ఈ సందర్భంగా చిత్ర హీరో కార్తీ మాట్లాడుతూ.. కోట్ల రూపాయల వ్యాపారంతో కూడిన చిత్ర నిర్మాణం రంగాన్ని దెబ్బతీసేందుకు పైరసీ దారులు కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. సినిమాను కొంత మంది ఆట అనుకుంటున్నారని, అందుకే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తమ చిత్రం పాటలను ఇంటర్నెట్లో విడుదల చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సీబీసీఐడీని ఆశ్రయించామన్నారు.
ఇక ఈ చిత్రంపై తమిళనాట మంచి అంచనాలే ఉన్నాయి. తెలుగులోనూ బాగానే మార్కెట్ అవుతుందని భావిస్తున్నారు. తెలుగులో కార్తీకి ఉన్న బిజినెస్ ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ వారికి నచ్చే ఎలిమెంట్స్ కలిపి మరీ నిర్మించారని చెప్తున్నారు. శకుని,బ్యాడ్ బోయ్ చిత్రాలు నిరాశ పరిచిన నేపధ్యంలో ఈ చిత్రం కార్తీకి ఊపునిస్తుందని భావిస్తున్నారు.