twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎఫైర్ కట్ చేసుకోమంటూ...త్రిషకు ముఖ్యమత్రి వార్నింగ్!?

    By Srikanya
    |

    త్రిషకు తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి నుంచి వార్నింగ్ వచ్చినట్లుగా చెన్నై పిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. కరుణానిధి మనవడు ఉదయగిరి స్టాలిన్ వరసగా త్రిషను పెట్టి సినిమాలు తీస్తూ కోట్లు నష్టపరుస్తున్నాడని, అంతేగాక త్రిష మోజులో పడి మిగతా వ్యాపాలను, కుటుంబాన్ని పట్టించుకోవటంలేదని మండిపడుతున్నట్లు తెలుస్తోంది. తాత దగ్గర బాగా గారం కల ఉదయగిరి స్టాలిన్ ఆయన మాట ఒక్కరికే విలువ ఇచ్చి మాట వింటారు. అందులోనూ తాజాగా ఉదయగిరి స్టాలిన్..కమల్ హాసన్, త్రిష కాంబినేషన్ లో మన్మధ బాణం చిత్రం నిర్మించారు. అది భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయింది. ఇక ఇప్పుడు అతనే స్వయంగా హీరోగా త్రిష హీరోయిన్ గా చిత్రం చేయటానికి సన్నాహాలు ప్రారంభించారు. ఈ చిత్రానికి శివ మనసుల శక్తి, బాస్ ఎన్గిర భాస్కరన్ వంటి హిట్ చిత్రాల దర్శకుడు రాజేష్ ఎం.దర్శకత్వం వహించనున్నారు. నన్బేండా అనే పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా తొలుత శృతిహాసన్ నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆమె స్థానంలో ప్రస్తుతం త్రిష ఎంపిక చేసారు. షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. అయితే కరణానిధి మాత్రం ఈ మ్యాటర్ పై సీరియస్ గా ఉన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X