Don't Miss!
- News తెలంగాణాలో ద్రోణి ప్రభావం: మూడురోజులపాటు గ్రేటర్ హైదరాబాద్ తోపాటు పలు జిల్లాల్లో వర్షాలు!!
- Lifestyle ఈపాప చూడటానికి చాలా అందంగా ఉంది, కానీ ఓ వింత రోగం తినరానివి తింటుంది! నా కూతుర్ని రక్షించండి!!
- Finance Stock Market: ఎన్నికల ముందు మార్కెట్లలో అలజడి.. కుప్పకూలిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Sports ముంబయి ఇండియన్స్కు కొత్త బౌలర్ వచ్చాడు
- Automobiles కొత్తగా మారిన ప్రమాదానికి గురైన కారు - ఫిదా చేస్తున్న వీడియో!
- Technology గూగుల్ క్రోమ్ భద్రత కోసం సరికొత్త ఫీచర్.. వెబ్సైట్లోకి వెళ్లగానే మాల్వేర్ అటాక్లపై అప్రమత్తం చేస్తుంది!
- Travel హోలీ సందర్భంగా దేశంలోని ఈ ప్రదేశాలను చుట్టేయండి..!
ఏమో చేద్దామని అనుకుంది.. చివరకు జోకర్ అయింది.. వనిత వ్యాఖ్యలపై కస్తూరీ ఫైర్
వనిత విజయ్ కుమార్ మళ్లీ వార్తల్లో నిలిచింది. చూస్తుంటే ఎంతో ముచ్చట పడి చేసుకున్న మూడో పెళ్లి కూడా పెటాకులయ్యేలానే కనిపిస్తోంది. పీటర్ పాల్, వనిత మధ్య గొడవలు జరిగాయని, భర్తను తన్ని ఇంటి నుంచి తరిమేసిందనే వార్తలు దావానంలా వ్యాప్తి చెందాయి. ఈ క్రమంలో వనిత ఎమోషనల్ అవుతూ ఓ సుధీర్ఘమైన లేఖను పోస్ట్ చేసింది. అంతకు ముందు వరుసగా ట్వీట్లు చేసింది. మొత్తానికి ఈ ట్వీట్ల సారాంశాన్ని బట్టి చూస్తే మూడో పెళ్లి కథ కంచికి చేరినట్టుంది.
అందరూ కలిసి..
కోవిడ్ లాంటి కష్ట కాలంలో, మీడియా మమ్మల్ని ఎంతగా టార్గెట్ చేసినా, మా పర్సనల్ విషయాలను వాడుకుని ఎంతో మంది పేరు, డబ్బులను సంపాదించుకున్నా మేం మాత్రం ప్రేమగా నవ్వుకుంటూనే ఉన్నాం. మా వ్యక్తిగత విషయాలను రోడ్డుకు ఈడ్చీ మీడియలో సర్కస్ చేయించినట్టు ఆడుకున్నారు అంటూ వనిత ఎమోషనల్ అయింది.
అనుకోనిది జరిగింది..
నేను అనుకోనిది జరిగింది.. ఇలా కాకుండా ఉండాల్సింది కానీ అయింది. కానీ ఏదో ఒక అద్భుతం జరుగుతుందన్న నమ్మకం నాకుంది. ప్రేమ కోసం ఎదురుచూస్తున్నా.. అతను వస్తాడని అనుకుంటున్నాను అంటూ అసలు విషయాన్ని చెప్పకుండా తమ మధ్య గొడవలు జరిగాయన్న విషయాన్ని పరోక్షంగా వనిత చెప్పుకొచ్చింది.
నిజాయితీ, ముక్కుసూటి..
కొందరు మా మీద పడి బతుకుతున్నారు.. పక్కవారి బాధల్లోంచి సంతోషాన్ని వెతుక్కుంటున్నారు.. కానీ నేను నిజాయితీగానే ఉంటాను.. ముక్కుసూటిగానే మాట్లాడతాను. ఏదైనా జరిగితే నేనే నేరుగా ప్రపంచానికి చెబుతాను. నా దగ్గర దాచడానికి ఏమీ లేదు.. పైగా నేను ఏదీ దాచను కూడా అంటూ వనిత కాస్త ఘాటుగానే స్పందించింది.
కస్తూరీ ఫైర్..
అయితే వనిత చేసిన ఈ వ్యాఖ్యలు కస్తూరీ, సూర్యా దేవీ, విజయన్ వంటి వారినేని అందరికీ తెలిసిందే. కొందరు నెటిజన్లు ఇదే విషయంపై కస్తూరిని నిలదీశారు. దీనిపై ఘాటుగా స్పందించిన కస్తూరీ.. ఒక వేళ మీ జీవితాన్ని పర్సనల్గా ఉంచాలని అనుకున్నప్పుడు మీరు కూడా ప్రైవేట్గానే ఉండాలని ఫైర్ అయింది.
Recommended Video
జోకర్లా మిగిలింది..
ప్రతీదీ సోషల్ మీడియాలో పెట్టేసి పర్సనల్ లైఫ్ అంటే ఎలా..తాజా విషయాన్ని కూడా పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వడం ఎందుకు? దీన్నే స్టంట్ అంటారని కస్తూరీ సెటైర్ వేసింది. ఎవ్వరూ కూడా ఆమె లైఫ్ను మీడియా సర్కస్ చేయలేదు. ఆమె అంతా చేసుకుంది. ఆమె సర్కస్, ఆమె కోతులు అన్నీ. అయితే రింగ్ మాస్టర్ కూడా ఆమెనే అని అనుకుంది. కానీ చివరకు జోకర్లా మిగిలింది. ఆమె నిజాయితీ, ముక్కుసూటి అని మాటలు చెబుతూ ఉంటే నాకు నవ్వొస్తుందని కస్తూరీ కౌంటర్లు వేసింది.