Don't Miss!
- News లేడీ స్కూట్ టీచర్ ను ఎత్తుకెళ్లిన యువకుడు, జాతరకు వెళ్లిన టైమ్ లో ప్లాన్ చేసి, అంతేనా!
- Lifestyle చాణక్య నీతి : పొరపాటున కూడ భార్యకు ఈ 5 విషయాలు అస్సలు చెప్పకూడదు..!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ముదిరిన మూడో పెళ్లి వివాదం.. అర్దరాత్రి అరెస్ట్లు.. సారీ చెప్పాల్సిందేనంటూ వనితపై హీరోయిన్ ఫైర్
వనితా విజయ్ కుమార్-పీటర్ పాల్ వివాహం తమిళ నాట పెద్ద ఎత్తున చిచ్చును రగిల్చింది. ఓ వైపు కరోనా విజృంభిస్తుండగా.. మరో వైపు వనిత మూడో పెళ్లి వివాదం ఎన్నో మలుపులు తిరుగుతోంది. పీటర్ తన భార్య ఎలిజబెత్ హెలెన్కు విడాకులు ఇవ్వకుండా వనితను పెళ్లి చేసుకోవడంతో అందరూ వేలెత్తి చూపుతున్నారు. వనిత చేసింది తప్పంటూ నిర్మాత రవీంద్రన్, సూర్యా దేవి, కస్తూరీ శంకర్, లక్ష్మీ రామకృష్ణన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.
రచ్చ రచ్చగా మారిన వివాదం..
పీటర్ తనను మోసం చేసిన వనితను పెళ్లి చేసుకున్నాడని ఎలిజబెత్ బయటకు రావడంతో ఈ వివాదం మొదలైంది. షూటింగ్ కోసమే పెళ్లి చేసుకుంటున్నానని, అబద్దాలు చెప్పి తనను మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే దీనిపై వనిత స్పందిస్తూ.. ఆమె డబ్బు కోసమే ఇదంతా చేస్తోందని ఆరోపణలు చేసింది.
సోషల్ మీడియాలో వైరల్..
సూర్య దేవి, నిర్మాత రవీంద్రన్, కస్తూరీ శంకర్, లక్ష్మీ రామకృష్ణన్ వంటి వారు సోషల్ మీడియాలో వనితను ఏకిపారేయడం ప్రారంభించారు. వనిత చేసింది తప్పేనని, విడాకులు తీసుకోకుండా పీటర్ పెళ్లి చేసుకోవడం చట్ట విరుద్దమని సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. అందులో మరీ ముఖ్యంగా దేవీ సూర్య యూట్యూబ్లో వనితను వ్యక్తిగతంగా దూషించింది.
వనిత ఫిర్యాదు..
సూర్య దేవిపై వనిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమెను అర్దరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంట్లో పిల్లలు ఒంటరిగా ఉన్నారని చెబితే కూడా వినలేదని ఆమె వాపోయింది. ఈ మొత్తం ఘటనపై కస్తూరీ శంకర్ ఫైర్ అయింది. ఆమె ఎంటరై సూర్య దేవికి బెయిల్ వచ్చేలా చేసింది. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో వనితపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
కస్తూరీ శంకర్ ఫైర్..
పొద్దునే లేవగానే సూర్య దేవిని అరెస్ట్ చేశారనే వార్త తెలిసిందని, తనపై కూడా ఫిర్యాదు చేసిందని కస్తూరి ఫైర్ అయింది. తన మీద ఫిర్యాదు చేయడం కాస్త కామెడీగానే ఉందని పేర్కొంది. సూర్యా దేవీ బెయిల్ మీద వచ్చిందని, తన లాయర్ అంతా చూసుకుంటున్నాడని తెలిపింది. ముఖ్యంగా ఆమె పిల్లలు భద్రంగానే ఉన్నారని పేర్కొంది.
Recommended Video
సారీ చెప్పాల్సిందే..
వనిత వ్యక్తిగత నిర్ణయాన్ని తానెప్పుడు జడ్జ్ చేయలేదని, ఆమె హక్కును తాను ఎప్పుడూ సమర్థించాని తెలిపింది. కానీ ఆమె, ఆమె భర్త చేసిన క్రిమినల్ చర్యలను మాత్రం ఖండిస్తున్నానని పేర్కొంది. వనితా సారీ చెప్పాలని, తాను ఎలిజబెత్కు సపోర్ట్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది.