Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కారులోనే పని కానిచ్చేస్తున్నారు.. ఆ వీడియోను షేర్ చేసిన నాటి హీరోయిన్
కస్తూరీ శంకర్ ఒకప్పుడు ఓ ఊపు ఊపేసిన హీరోయిన్. అన్నమయ్య సినిమాలో ఓ హీరోయిన్గా నాగార్జునతో ఆడి పాడిన హీరోయిన్ ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తోంది. తమిళం మంచి పేరు సంపాదించుకున్న కస్తూరి.. తెలుగు వారికీ సుపరిచితమే. అయితే ఇక్కడ ఎక్కువగా సినిమాలు చేయలేకపోవడంతో గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం బుల్లితెర సీరియల్(ఇంటింటి గృహలక్ష్మీ)తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే ఇదంతా ఆమెలోని ఓ కోణమే. ఆమె సోషల్ మీడియాలో ఎంతలా యాక్టివ్గా ఉంటుందో కొందరికి మాత్రమే తెలుసు.
సోషల్ మీడియాలో యాక్టివ్..
కస్తూరి సోషల్ మీడియాలో తెగ యాక్టివ్గా ఉంటుంది. సామాజిక సమస్యలపై స్పందిస్తుంటుంది. అంతేకాకుండా ఫ్యాన్స్ వార్లను కూడా ఏకిపారేస్తూ ఉంటుంది. ఆ మధ్య అజిత్, విజయ్ ఫ్యాన్స్ వార్ను ఉద్దేశించి.. ‘అజిత్, విజయ్ ఇద్దరూ బాగానే ఉంటారు.. వారిద్దరు బాగానే మాట్లాడుకుంటారు.. మీరు శాపనార్థాలు పెట్టినంత మాత్రానా ఏమీ జరగదు.. అయినా ప్రపంచమంతా ఇప్పుడు అతలాకుతలం అవుతూ ఉంటే.. మీరు ఇలాంటి చేయడం అవసరమా? నెగెటివిటీని వదిలేయండి.. మీరు బతకండి.. అవతలి వారిని బతకనివ్వండ'ని ట్వీట్ చేసింది.
జయరాజ్, ఫినిక్స్ ఘటనపై..
ప్రస్తుతం తమిళ నాడును షేక్ చేస్తోన్న ఘటన గురించి అందరికీ తెలిసిందే. తండ్రీ కొడుకులను లాకప్లో చిత్రహింసలు పెట్టి వారి చావుకు కారణమైన ఘటన దేశాన్ని కుదిపేసింది. జయరాజ్ ఫినిక్స్ ఘటనపై దేశం మొత్తం పోలీసులకు వ్యతిరేకంగా నిలిచింది. ఈ ఘటనపై కస్తూరి స్పందిస్తూ వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. అంతేకాకుండా టీవీ డిబెట్లలోనూ ఈ ఘటనకు వ్యతిరేకంగా తన గొంతును వినిపించింది.
ప్రస్తుతం ఓ వీడియో..
కస్తూరి ఈ మధ్య ట్విట్టర్లో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో కారులోనే అధికారులు పని కానిచ్చేస్తున్నారు. ఆ ఘటన అక్కడి సీసీటీవీ పుటేజ్ ద్వారా బయటకు రావడంతో వైరల్ అయింది. అధికారులు ఇలా చేయడంపై కస్తూరి స్పందింస్తూ ఆ వీడియోను షేర్ చేసింది.
కారులోనే పని..
కస్తూరి ట్వీట్ చేస్తూ.. ‘ఇజ్రాయెల్లో ఈ ఘటన జరిగింది.. టెల్ అవివ్ రోడ్డులో అధికారిక వాహనాల్లో ఇలాంటిది జరగడంపై యూనైటెడ్ నేషన్స్ అధికారులు షాక్కు గురయ్యారు. పూర్తి విచారణకు ఆదేశించారు. అలాంటి వారు ప్రతీ చోటా ఉంటారు'అని పేర్కొంది.
Recommended Video
భిన్న రకాల కామెంట్స్..
కస్తూరి షేర్ చేసిన ఈ వీడియో, ట్వీట్పై భిన్న రకాల కామెంట్స్ వస్తున్నాయి. మరో సుచి కావాలని ట్రై చేస్తున్నావా? అని కొందరు.. అది ఫేక్ అని మరి కొందరు.. ఆ కారుపై యూఎన్ అనేది మాయమైందని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇది నిజమని, అంతర్జాతీయంగా వైరల్ అయిందని కస్తూరి చెప్పుకొచ్చింది.