Don't Miss!
- News TTD: శ్రీవారి దర్శనం , సేవలు, వసతి గదుల కోటా విడుదల...!!
- Sports ఛాంపియన్లా వస్తున్నాం.. ఇది ఆరంభం మాత్రమే - పంత్
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
గృహ నిర్భంధంలో మణిరత్నం కుమారుడు.. భేష్ సుహాసిని అంటూ ప్రశంసలు
సింగర్ కనికాకపూర్ కరోనావైరస్ వివాదం మీడియాలో హాట్హాట్గా నడుస్తుంటే.. మరో సెలబ్రిటీ కుటుంబ సభ్యుడు ప్రాణాంతక వ్యాధి ఉండవచ్చనే అనుమానంతో స్వీయ నిర్బంధం విధించుకొన్నారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం, నటి సుహాసిని కుమారుడు నందన్ మణిరత్నం ఇటీవల లండన్ నుంచి చెన్నైకి చేరుకొన్నారు. అయితే కరొనావైరస్ ముప్పుతో ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకొంటున్నాడు. వివరాల్లోకి వెళితే..
గృహ నిర్బంధంలో నందన్
నందన్ మణిరత్నం తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. లండన్ నుంచి రాగానే ఓ గదిని ఐసోలేటెడ్ రూమ్గా మలచుకొని స్వీయ నిర్బంధం విధించుకొన్నారు. అతడికి కావాల్సిన వసతులను, అవరసరాలను గ్లాస్ కిటికి నుంచి మాట్లాడుతూ ఏర్పాటు చేస్తున్నారు. తన కుమారుడితో మాట్లాడుతున్న సుహాసిని వీడియోను నటి కుష్బూ విడుదల చేసింది.
సుహాసిని గ్లాస్ కిటికీలో మాట్లాడుతూ..
వీడియోలో సుహాసిని మాట్లాడుతూ.. స్వీయ నిర్బంధంలో ఉన్న నా కొడుకుతో గ్లాస్ కిటికి ద్వారా మాట్లాడుతున్నాను. అతడు మార్చి 18న లండన్ నుంచి తిరిగి వచ్చారు. కానీ అతడికి కరోనా పాజిటివ్ పాజిటివ్గా రాలేదు. అయినా ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకొన్నాడు. అతడికి మా కుటుంబం సహకారం అందిస్తున్నది అని సుహాసిని చెప్పడం గమనార్హం.
14 రోజులు ఇంట్లోనే ఉంటా
తల్లి సుహాసిని మాటలకు సమాధానం ఇస్తూ.. ప్రతీ ఒక్కరికి నమస్కారం. గత ఐదు రోజుల క్రితం లండన్ నుంచి తిరిగి వచ్చాను. అప్పటి నుంచి ఒంటరిగా ఇంట్లోనే ఉంటున్నాను. మరో 14 రోజులు ఇంట్లో నుంచి బయటకు రాను. చాలా బోరుగా ఉన్నప్పటికీ.. ఇతరుల క్షేమం కోసం ఇంతకంటే ఏం చేయగలను అని నందన్ మణిరత్నం అన్నారు.
Recommended Video
|
కుష్బూ ప్రశంసలు
తల్లి, కొడుకులు బాధ్యతగా వ్యవహరించడంపై కుష్భూ ప్రశంసల వర్షం కురిపించింది. బాధ్యతయుతమైన వ్యక్తులంటే వీళ్లే.. నందన్ మణిరత్నం, సుహాసినికి నా ధన్యవాదాలు. వారి నుంచి ప్రతీ ఒక్కరు నేర్చుకోవాల్సిన అవసరంఉంది. నందన్ సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను. వారిద్దరికి నా ప్రేమతో కూడిన అభినందనలు అంటూ కుష్బూ వీడియోను ట్వీట్ చేస్తూ మెసేజ్ పెట్టారు.