Don't Miss!
- News మరో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల: బరిలో తీన్మార్ మల్లన్న
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Sports RCB: నా గుండె బద్దలైంది- డివిలియర్స్
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
తమిళ హీరోతో కియారా అద్వానీ రొమాన్స్.. నయనతార లవర్ను లైన్లోపెట్టి..
బాలీవుడ్ తార అనుష్క శర్మ కోలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారనే న్యూస్ వైరల్ అవుతున్న నేపథ్యంలో తమిళ ప్రేక్షకులకు మరో సంతోషకరమైన విస్తృతంగా ప్రచారం అవుతున్నది. త్వరలోనే అందాల భామ కియారా అద్వానీ కోలీవుడ్లో అడుగుపెట్టనున్నట్టు ఓ వార్త ప్రచారం అవుతున్నది.
తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించే సినిమాలో పాపులర్ హీరో శివ కార్తీకేయన్ సరసన నటించేందుకు కియారా ఓకే చెప్పారని ఓ వార్త తమిళ మీడియాలో హల్ చల్ చేస్తున్నది. అయితే దీనిపై విఘ్నేష్, శివకార్తీకేయన్, కియారా పెదవి విప్పకపోవడంతో ఇందులో వాస్తవమేంత అనేది ప్రశ్నగానే మిగిలింది.
ఇక కియార విషయానికి వస్తే, బాలీవుడ్, టాలీవుడ్, నెట్ఫ్లిక్స్ అనే తేడా లేకుండా జోరుగా నటిస్తున్నది. తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాలతో ప్రేక్షకులకు చేరువైంది. ఇక కోలీవుడ్లో అడుగుపెట్టేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. బాలీవుడ్లో కబీర్ సింగ్, షేర్షా, లక్ష్మీ బాంబ్ చిత్రాలతో బిజీగా మారింది. కబీర్ సింగ్ త్వరలోనే విడుదలకు సిద్ధమవుతున్నది.
ఇక శివకార్తీకేయన్ కూడా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఆర్ రవికుమార్ దర్శకత్వంలో కూడా నటిస్తున్నాడు. పాండి రాజ్ అనే చిత్రం షూటింగ్ దశలో ఉంది.