Don't Miss!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
విమలా రామన్ పై బ్యాన్ నిర్ణయం
తెలుగులో జగపతిబాబు సరసన చాలా చిత్రాల్లో చేసిన విమలారామన్ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడామెపై బ్యాన్ పెట్టేందుకు తమిళ సినీ పరిశ్రమ నిర్ణయం తీసుకోబోతోంది. ఈ మేరకు నిర్మాతల మండలి చర్చించినట్లు సమాచారం. దానికి కారణం ఆమె నటించిన డ్యాం 999 అనే హాలీవుడ్ చిత్రం. ఈ నెల 25న విడుదల కానున్న ఈ చిత్రం తమిళుల మనోభావాల్ని దెబ్బతీయాలన్న లక్ష్యంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ఆందోళనలు వెల్లు వెత్తుతున్నాయి.ఎండీఎంకే, పీఎంకే వర్గాలు డ్యాం 999ను అడ్డుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈ చిత్రాన్ని నిషేధించాలంటూ డీఎంకే ఎంపీలు బుధవారం పార్లమెంట్లో కేంద్రం పై ఒత్తిడి తెచ్చారు. అదే సమయంలో ఈ చిత్రం విడుదలను అడ్డుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తూ డీఎంకే అధినేత కరుణానిధి ఓ ప్రకటన విడుదల చేశారు.
ఆంగ్లేయుల కాలంలో నిర్మించిన ముల్లై పెరియార్ డ్యాం మీద తమిళులకు పూర్తి హక్కు ఉందని తెలిపారు. ఈ హక్కుల్ని కాలరాయాలన్న ఉద్దేశంతో పథకం ప్రకారం డ్యాం 999ను నిర్మించినట్లు అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు. కేరళ, తమిళనాడు ప్రజల మధ్య ఉన్న సత్సంబంధాలను ఈ చిత్రం దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ముల్లై పెరి యార్ డ్యాం కట్టలు తెగితే భారీ నష్టం ఉంటుందని ఈ చిత్రంలో ఎత్తిచూపినట్లు సంకేతాలు ఉన్నాయని తెలిపారు. దీనిని బట్టి చూస్తే ముల్లై పెరియార్ డ్యామ్ను కూల్చి వేయించాలన్న లక్ష్యంతోనే చిత్రాన్ని తీసినట్లుగా భావన కలుగుతోందని పేర్కొన్నారు.డ్యాం 999లో నటించిన నటి విమలారామన్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. మలారామన్కు తమిళంలో అవకాశాలు ఇవ్వకూడదని, ఆమె నటించిన ఇతర భాషా చిత్రాల విడుదలను తమిళనాడులో అడ్డుకోవాలని కోలీవుడ్ వర్గాలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.