Don't Miss!
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- News ముస్లీం రిజర్వేషన్లపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు, మేము వస్తే ఖేల్ కథం !
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
11ఏళ్ల తరువాత హిట్టు సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేసిన సూర్య!
కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడైన సూర్య తెలుగులో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ని సెట్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తమిళ్ లో సక్సెస్ అందుకుంటున్నట్లుగా సూర్య తెలుగులో మునుపటిలా కలెక్షన్స్ అందుకోలేకపోతున్నాడు. ఎలాంటి సినిమా చేసినా కూడా తెలుగు రాష్ట్రాల్లో బోల్తా కొడుతున్నాయి.
సూర్య గత ఏడాది బందోబస్త్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కెవి.ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా తమిళ్ లో బాగానే సక్సెస్ అయ్యింది. అయితే అదే దర్శకుడితో సూర్య మరో సినిమాను ప్లాన్ చేసుకుంటున్నాడు. అయితే ఆ కొత్త ప్రాజెక్ట్ 11 ఏళ్ల క్రితం వచ్చిన 'అయాన్' సినిమాకు సీక్వెల్ అని తెలుస్తోంది. ఆ సినిమా తెలుగులో వీడొక్కడే అనే టైటిల్ తో రిలీజ్ అయ్యింది.
డబ్బింగ్ సినిమా అయినప్పటికీ తెలుగులో కూడా సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది. అప్పటి నుంచి సూర్య తెలుగులో తన మార్కెట్ ని పెంచుకుంటూ వెళుతున్నాడు. ఇక నెక్స్ట్ ఈ స్టార్ హీరో ఆ కథకు సీక్వెల్ తో రాబోతున్నాడు. దర్శకుడు కెవి.ఆనంద్ ఇప్పటికే కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లో ఈ ప్రాజెక్ట్ పై స్పెషల్ ఎనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.