Don't Miss!
- Finance Jio Financial Services: జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫలితాలు..
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- News amit shahకు సొంత కారు లేదట.. అవాక్కయ్యేలా అమిత్ షా ఆస్తులు, అప్పులు!!
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Sports ఆర్సీబీ తుది జట్టు అంచనా
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
రిలీజ్ కాలేదు కానీ...ఫేమస్ అయ్యింది
చెన్నై : తెరపైకి రాకముందే తన ప్రత్యేకతను చాటుకుంటోంది 'కుట్రం కడిదల్'. ఈ చిత్రం ద్వారా బ్రహ్మ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జేఎస్కే ఫిలిమ్ కార్పొరేషన్ బ్యానరుపై సతీష్కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే జింబాబ్వే, ముంబయి చిత్రోత్సవాలు, ఇండియన్ పనోరమ.. వంటి పలు వేదికలపై అవకాశం దక్కించుకుంది.
పలువురు ప్రముఖులు అభినందించారు. బెంగళూరులో జరుగనున్న 7వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకు కూడా తాజాగా ఎంపికైంది. దీనిపై సతీష్కుమార్ మాట్లాడుతూ.. ''ఈ కథ విన్నప్పటినుంచే నాకు సంతోషంగా ఉంది. సినిమా పూర్తయ్యాక.. ప్రతిక్షణం ఆనందాన్ని పంచుతోంది.
ఒక్కో మెట్టూ ఎక్కుతూ సినీ ప్రముఖులను ఆకట్టుకుంటోంది. ఇలాంటి సినిమాను నిర్మించినందుకు గర్వంగా ఉంది. మరిన్ని తీయాలనే ఉత్సాహానిస్తోంది. గతంలో తెరకెక్కించిన 'తంగమీన్గల్' కూడా పలు అవార్డులను సొంతం చేసుకుంది. తాజాగా పుదుచ్చేరి ప్రభుత్వ పురస్కారాన్ని కూడా దక్కిడం ఆనందంగా ఉంద''ని పేర్కొన్నారు.