మహేష్ ఆ తమిళ దర్శకుడు కథ ఓకే చేసాడు
తెలుగులో విడుదలైన 'రంగం' చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే మంచి చిత్రమని ప్రశంసలు అందుకుంది. మహేష్ బాబు ఈ చిత్రం ప్రివ్యూ ప్రత్యేకంగా వేయించుకుని చూసి దర్శకుడు కెవి ఆనంద్ ని మెచ్చుకున్నారు. ఇక మహేష్ బాబుతో కెవి ఆనంద్ కి ప్రత్యేక అనుభందం ఉంది. ఈ విషయమై ఆ మధ్యన కెవి ఆనంద్ మాట్లాడుతూ..మహేష్ బాబు తమ సినిమాకు ఛాయాగ్రహకుడిగా బాధ్యతలు వహించమని తరచూ అడుగుతుంటారు..కానీ సమయాన్ని కేటాయించలేకపోయాను అన్నారు. అయితే రీసెంట్ గా ఆయన మహేష్ ని కలిసి ఓ స్టోరీ లైన్ వినిపించారని, దానికి ఇంప్రైసైన మహేష్ పూర్తి స్క్రిప్టుతో కలవమని చెప్పినట్లు సమాచారం. ఓకే అయితే సూర్యతో తను చేయనున్న చిత్రం తర్వాత ఈ చిత్రం పట్టాలు ఎక్కించాలని కెవి ఆనంద్ భావిస్తున్నారు. ఇక దూకుడు తర్వాత మహేష్ వెంటనే సుకుమార్ దర్శకత్వంలో చేయటానికి సైన్ చేసారు.


Click it and Unblock the Notifications











