Don't Miss!
- Automobiles ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చేశారో.. ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే.!!
- News ఎన్నికల ఏజెంట్లుగా వాలంటీర్లు - సీన్ రివర్స్...!!
- Sports రుతురాజ్ చెత్త రికార్డు.. చరిత్రలో ఒకే ఒక్కడు!
- Technology Nokia 225 4G 2024 మోడల్ ధర, స్పెసిఫికేషన్లు మరియు డిజైన్ లీక్! వివరాలు
- Finance IT News: టీసీఎస్ టెక్కీలకు కళ్లు బైర్లుకమ్మే షాక్.. వారికి NO వేరియబుల్ పే.. కొత్త రూల్స్..!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మరో క్రేజీ ప్రాజెక్టుతో విజయేంద్ర ప్రసాద్.. అక్కడ కూడా సత్తా చాటేందుకు..
గత కొద్దికాలంగా ప్రముఖ మాటల రచయిత కేవీ విజయేంద్ర ప్రసాద్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సత్తా చాటుతున్నాడు. బాహుబలి సిరీస్తో ప్రపంచానికి తెలుగు సత్తా ఏమిటో చూపించారు. అంతేకాకుండా ఆయన అందించిన కథతో వచ్చిన భజ్రంగీ భాయ్జాన్, మెర్సల్ లాంటి చిత్రాలు కాసులు వర్షం కురిపించాయి. తాజాగా తన పెన్ పవర్ చూపించడానికి ఇప్పుడు మలయాళ పరిశ్రమలో అడుగుపెట్టాడు.
తాజా సమాచారం ప్రకారం.. మలయాళంలో చారిత్రాత్మక నేపథ్యంతో తెరకెక్కే ఓ భారీ బడ్జెట్ చిత్రానికి స్క్రిప్టు అందిస్తున్నారు. ఈ చిత్రానికి విశ్వగురు ఫేమ్, గిన్నిస్ బుక్ రికార్డు విజేత విజీష్ మణి దర్శకత్వం వహిస్తున్నారు. విశ్వగురు సినిమాను కేవలం 51 గంటల రెండు నిమిషాల్లో పూర్తి చేశారు. సెప్టెంబర్లో ఈ చిత్రం సెట్స్పైకి వెళ్తుంది.
ప్రస్తుతం మలయాళ సినిమాతోపాటు RRR సినిమాకు కథను,మాటలను అందిస్తున్నారు. బాహుబలితో అంతర్జాతీయ ఖ్యాతిని అందించిన ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, జూనియర్ ఎన్టీఆర్, ఆలియా భట్, అజయ్ దేవగన్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం జూలై 30, 2020 రోజున విడుదల కానున్నది.