Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మకాం మార్చిన మలయాళి భామ
ఆ సమయంలో 9వ తరగతి విద్యార్థిని అయిన లక్ష్మీమీనన్ నటన ఎంతో పరిణితితో ఉందని దర్శకుడు ప్రభుసాల్మన్ కితాబిచ్చాడు. అనంతరం నటుడు శశికుమార్ 'సుందరపాండియన్'లో అవకాశమిచ్చాడు. ఇవి రెండూ ఘన విజయాలు సాధించటంతో శశికుమార్ తన కొత్త చిత్రం 'కుట్టిపులి'లో కూడా ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నాడు. ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది.
ప్రస్తుతం లక్ష్మి మీనన్ చేతిలో 'మంజప్పైస', 'సిప్పాయ్', పాండియనాడు'తో పాటు సమారు అరడజను చిత్రాలు ఉన్నాయి. 'కుట్టిపులి'కి ముందు పదో తరగతి పరీక్షలు రాసేందుకు వెళ్లిన లక్ష్మీమీనన్ పైచదువుల కోసం తిరిగి సొంత వూరుకు వెళ్లనున్నట్లు తెలిపింది.
వరుస విజయాలు, అవకాశాలతో మనసు మార్చుకుంది. ప్రస్తుతానికి సినిమాలకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకుంది. కేరళ నుంచి చెన్నైకు చక్కర్లు కొట్టటం ఎందుకని ఏకంగా ఇక్కడికే మకాం మార్చింది. అవకాశాలు జోరు కొనసాగినంత కాలం ఇక్కడే ఉంటానని చెబుతోంది.