Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అందర్నీ భయపెట్టిన ఆ క్రికెటర్ బయోపిక్ తెరకెక్కడం కష్టమే..?
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇటీవల కాలంలో బయోపిక్స్ ఎక్కువగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా క్రికెటర్స్ జీవితాలపై సినిమాలు ఒక రేంజ్ లో వస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద వారి సినిమాలకు కలెక్షన్స్ కూడా గట్టిగానే వస్తున్నాయి. నెక్స్ట్ కపిల్ దేవ్ జీవిత ఆధారంగా రూపొందుతున్న 83 అనే సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.
అసలు మ్యాటర్ లోకి వస్తే.. మొదటి సారి కోలీవుడ్ లో ఒక క్రికెటర్ బయోపిక్ రాబోతున్నట్లు కొన్ని నెలల క్రితం ఒక అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వచ్చింది. ఆ క్రికెటర్ మరెవరో కాదు. శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్. విజయ్ సేతుపతి మురళి బయోపిక్ లో కనిపించనున్నట్లు ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. ప్రపంచంలోని అతి భయంకరమైన బ్యాట్స్ మెన్ లను సైతం తన బౌలింగ్ తో భయపెట్టి 800వికెట్లు తీసిన ఆటగాడిగా మురళీధరన్ చరిత్ర సృష్టించారు.
అందుకే ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ కోసం 800 అనే టైటిల్ కూడా సెట్ చేసినట్లు టాక్ వచ్చింది. అయితే ఆ ప్రాజెక్టు ఇప్పుడు ఆగిపోయిందనే కామెంట్స్ వస్తున్నాయి. కరోనా వైరస్ కారణంగా పరిస్థితులు మారడంతో నిర్మాతలు ఆ ప్రాజెక్టును ఇప్పుడు పట్టించుకోవడం లేదు. ప్రీ ప్రొడక్షన్ లోనే సినిమా ఆగిపోవడంతో పెద్దగా నష్టం రాలేదు. మరి భవిష్యత్తులో అయినా ఆ సినిమాను ఎవరైనా స్టార్ట్ చేస్తారో లేదో చూడాలి.