Don't Miss!
- News రూ.100 తో ఊరు వదిలాడు.. రూ.200 కోట్లకు అధిపతి
- Sports RCB Playing XI: అతనికి నిరాశే.. సన్రైజర్స్ హైదరాబాద్తో తలపడే ఆర్సీబీ తుది జట్టు ఇదే!
- Lifestyle పురుషుల్లో ఈ లక్షణాలు ఉంటే.. ఖచ్చితంగా డిప్రెషన్కు గురైనట్టే..!
- Automobiles కారులో ఎక్కువ సౌండ్తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
వివాదాస్పదంగా మారిన దర్బార్ సీన్లు.. తీసేసినట్టు ప్రకటించిన నిర్మాతలు
ఒక సినిమాలో సన్నివేశానికి అనుగుణంగానే మాటలు రాసినా.. అవి బయటి వ్యక్తుల్లో ఎవరికో ఒకరికి తాకినట్టుగానే అనిపిస్తాయి. అయితే ఇందులో మరో కోణం కూడా ఉంటుంది. బయట జరిగిన సంఘటనలను ఆధారం చేసుకుని సీన్స్ పెడుతుంటారు.. డైలాగ్స్ రాస్తుంటారు. అలా రాసే సీన్లు, మాటలపై సెన్సార్ సభ్యుల నుంచి అనుమతి లభించినా.. కొందరు మాత్రం వ్యతిరేకిస్తుంటారు. ఈ క్రమంలోనే ఎన్నో సినిమాలకు బెదిరింపులు, హెచ్చరికలు ఎదురవుతుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే దర్భార్ చిత్రానికి ఎదురైంది.
ఘన విజయం సాధించిన దర్బార్..
ఏ ఆర్ మురుగదాస్-సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబోలో సినిమా వస్తుందంటేనే.. అంచనాలు అమాంతం పెరిగాయి. ఇక దర్బార్ టీజర్, ట్రైలర్ రిలీజ్ అయ్యాక రజినీ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూశారు. మొత్తానికి ఈ చిత్రం విడుదలై తమిళ నాట అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. విజయంతో పాటే విమర్శ కూడా వచ్చింది.
|
జైలు సీన్ వైరల్..
ముంబై సిటీ కమీషనర్ అయిన ఆదిత్య అరుణాచలం (రజినీ) జైలు, అందులోని వీఐపీ ఖైదీల గురించి చెబుతూ..డబ్బు ఉంటే జైలు నుంచి బయటకు వెళ్లి షాపింగ్ చేసి రావచ్చు అనే డైలాగ్ సందర్భాను సారమే అయినా తమ నాయకురాలిని కించపరిచేలా, ఆమెను ఉద్దేశించే అన్నట్లుగా ఉందని అనుచరులు రచ్చ చేస్తున్నారు.
వివరణ ఇచ్చినా..
అయితే అది వినోదం కోసమే పెట్టామని, ఎవరినీ ఉద్దేశించినది కాదని నిర్మాతలు వివరణ ఇచ్చినా, ఈ డైలాగ్ తమ నేత శశికళను ఉద్దేశించినదేనని అన్నాడీఎంకేలోని ఓ వర్గం నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే. ఇది రోజు రోజుకు పెరిగి పెద్దవి అవుతుండటంతో వివాదస్పదంగా మారిన సీన్, డైలాగ్ను తీసేశామని చిత్రయూనిట్ ప్రకటించింది.
వాటిని తొలగించిన నిర్మాతలు..
విజయవంతంగా
దూసుకుపోతున్న
దర్బార్కు
ఇలాంటి
వివాదాలు
ఎందుకన్నట్టుగా
వారు
అభ్యంతరం
వ్యక్తం
చేసిన
సీన్లు
తీసినట్టుగా
ప్రకటన
చేశారు.
ఇక
నుంచి
అవి
లేకుండా
సినిమా
ప్రదర్శితమవుతుందని
తెలిపారు.
తొలిరోజే
దాదాపు
వంద
కోట్లు
కొల్లగొట్టిన
దర్బార్..
తమిళ
నాట
అప్రతిహతంగా
దూసుకుపోతోంది.