Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
తమిళనాడు సర్కార్కు లైకా ప్రొడక్షన్ భారీ విరాళం.. సీఎం స్టాలిన్కు చెక్ అందజేత
తమిళనాడును కరోనావైరస్ అతలాకుతలం చేసింది. గత ఏడాదిన్నర కాలంగా ప్రజలను, ప్రభుత్వాన్ని ఎంతో ఇబ్బందికి గురిచేస్తున్నది. పలు రకాలుగా ప్రాణ నష్టం, అలాగే ప్రభుత్వ ఆదాయానికి గండిపడటంతో సంక్షేమం కార్యక్రమాలను కొనసాగించడం అలాగే కరోనా బాధితులను ఆదుకోవడం కష్టంగా మారింది. ఈ క్రమంలో పలు స్వచ్చంద సంస్థలు, సినీ తారలు విరాళాలతో స్పందించారు. ఈ క్రమంలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ భారీ విరాళాన్ని తమిళనాడు ప్రభుత్వానికి అందించింది.
లైకా ప్రొడక్షన్ అధినేత అల్లిరాజా శుభకరణ్ తరుఫున ఆయన ప్రతినిధులు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ జీకేఎం తమిళ్కుమరన్, మిస్టర్ నిరుథన్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎం స్టాలిన్ను కలిసి రూ.2 కోట్ల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు. కరోనా సహాయ పనులకు ఉపయోగించాలని కోరారు.
లైకా ప్రొడక్షన్స్ విషయానికి వస్తే.. తమిళంలో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్నది. 2014 నుంచి సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టిన ఈ సంస్థ వడా చెన్నై, మాఫియా, రోబో 2 చిత్రాలతోపాటు సూర్యతో కాప్పన్, రజనీకాంత్తో దర్బార్ సినిమాలను నిర్మించింది. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు శంకర్తో ఇండియన్ 2, మణిరత్నంతో పొన్నియన్ సెల్వన్ తెరకెక్కిస్తున్నది.
ఇదిలా ఉండగా, ఇటీవల విజయ్ సేతుపతి కూడా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కలిసి భారీ విరాళం అందించిన విషయం తెలిసిందే.