Don't Miss!
- News ఘర్ వాపసీ: రేవంత్ రెడ్డిని కలిసిన కేకే, కేసీఆర్ గౌరవం ఇచ్చారు కానీ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
నాకు 58 శాతమే వచ్చింది.. సీబీఎస్ఈ ఫలితాలపై రొమాంటిక్ హీరో కామెంట్
తాజాగా సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ ఫలితాలు వచ్చాయి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఇదే చర్చ జరగుతోంది. కరోనా సమయంలో పరీక్ష ఫలితాలు రావడంపై కొందరు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశమున్నందున సాక్ష్యాత్తు ప్రధాని నరేంద్ర మోదీ సైతం స్పందించాడు. తక్కువ మార్కులు వచ్చినంత మాత్రాన చింతించాల్సిన అవసరం లేదని, విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ప్రయత్నించారు. ఈ మేరకు ప్రధాని చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.
సీబీఎస్ఈ ఫలితాలు వచ్చాయి.. పాస్ అయిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు, వారి రాబోవు భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నట్టుగా ట్వీట్ చేశారు. అంతేకాకుండా మరో ట్వీట్ చేస్తూ.. సీబీఎస్ఈ ఫలితాల వల్ల ఎవరైనా అసంతృప్తికి లోనట్టైతే వారి గురించి ఒకటి చెప్పదలుచుకుంటున్నాను. ఒక్క పరీక్ష మీరెంటో, మీ ప్రతిభను నిర్వచించలేదు. మీ అందరికీ అంతులేని ప్రతిభ ఉంటుంది. నిరాశ చెందకండి, ముందుకు సాగండి.. మీరు అద్భుతాలు సృష్టిస్తారు' అని అందరిలోనూ స్ఫూర్తి నింపారు. అదే విధంగా హీరో మాధవన్ సైతం తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పుకొచ్చాడు.
సీబీఎస్ఈ ఫలితాల్లో తక్కువ మార్కులు లేదా ఫెయిల్ అయిన విద్యార్థుల్లో ధైర్యం నింపేందుకు మాధవన్ ముందుకు వచ్చాడు. 'బోర్డ్ ఫలితాలు చూసుకున్న వారందరూ.. వారు ఊహించనట్టుగా, అంతకు మించి ఫలితాలు సాధించిన వారికి కంగ్రాట్స్.. మిగిలిన వారందరికీ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను.. నాకు బోర్డ్ ఎగ్జామ్స్లో 58 శాతమే వచ్చింది. మీ ఆట ఇంకా మొదలే కాలేదు ఫ్రెండ్స్' అంటూ చదువే సమస్తం కాదని పరోక్షంగా చెప్పుకొచ్చాడు మాధవన్. మాధవన్ ప్రస్తుతం నిశ్శబ్దం చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దంగా ఉన్నాడు.