Don't Miss!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- News ఉరేయాలన్న బొత్స తండ్రి సమానుడా ? వైఎస్ నూ వదల్లేదుగా- జగన్ కు షర్మిల కౌంటర్..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
కేవలం 45 రోజుల డేట్స్ తో మహేష్ సినిమా?
మహేష్ బాబు సినిమా అంటే సంవత్సరాల తరబడి ఆలస్యం అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే కేవలం 45 రోజులు డేట్స్ ఇస్తే చాలు సినిమా పూర్తి చేస్తానంటూ శంకర్ ఆఫర్ ఇచ్చారుట. త్రి ఇడియట్స్ రీమేక్ కి ఆయన మహేష్ ని సంప్రదించి ఈ ప్రపోజల్ పెట్టారని ఫిల్మ్ సర్కిల్ లో వినపడుతోంది. ఎందుకంటే త్రీ ఇడియట్స్ లో అమీర్ ఖాన్ క్యారెక్టర్..మహేష్ చేయబోయేది. అది అప్పుడప్పుడు కనపడుతూ సినిమా మొత్తాన్ని లీడ్ చేస్తుంది. మిగతా రెండు పాత్రలూ (మాదవన్, శర్మాన్ జోషి) మిగతా గ్యాప్ ని పూర్తి చేస్తాయి. ఇవన్నీ ఆలోచించే ఈ ప్రపోజల్ పెట్టారు. దాంతో మహేష్ ఇది ఒక క్రేజీ ఆఫర్ గా భావించి వెంటనే ఒప్పేసుకున్నారుట. ఆల్రెడీ ప్రూవెడ్ సినిమా, శంకర్ లాంటి పెద్ద దర్సకుడు వీటికి తోడు షూటింగ్ డేస్ తక్కువ అనేది మహేష్ కి ఈ ప్రపోజల్ లో నచ్చిన విషయం అని చెప్పుకుంటున్నారు. ఇక మహేష్ తో నెలన్నరలో పూర్తి చేసి సంక్రాతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఖలేజా తర్వాత ఈ చిత్రమే రిలీజ్ అవుతుందా లేక శ్రీను వైట్లతో చేస్తున్న దూకుడు ని ముందుకు తీసుకెళ్తే బావుంటుందా అనే ఆలోచనలో మహేష్ ఉన్నారుట. ఇక ఈ చిత్రంలో మహేష్ సరసన ఇలియానా చేస్తోంది.