Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కేవలం 45 రోజుల డేట్స్ తో మహేష్ సినిమా?
మహేష్ బాబు సినిమా అంటే సంవత్సరాల తరబడి ఆలస్యం అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే కేవలం 45 రోజులు డేట్స్ ఇస్తే చాలు సినిమా పూర్తి చేస్తానంటూ శంకర్ ఆఫర్ ఇచ్చారుట. త్రి ఇడియట్స్ రీమేక్ కి ఆయన మహేష్ ని సంప్రదించి ఈ ప్రపోజల్ పెట్టారని ఫిల్మ్ సర్కిల్ లో వినపడుతోంది. ఎందుకంటే త్రీ ఇడియట్స్ లో అమీర్ ఖాన్ క్యారెక్టర్..మహేష్ చేయబోయేది. అది అప్పుడప్పుడు కనపడుతూ సినిమా మొత్తాన్ని లీడ్ చేస్తుంది. మిగతా రెండు పాత్రలూ (మాదవన్, శర్మాన్ జోషి) మిగతా గ్యాప్ ని పూర్తి చేస్తాయి. ఇవన్నీ ఆలోచించే ఈ ప్రపోజల్ పెట్టారు. దాంతో మహేష్ ఇది ఒక క్రేజీ ఆఫర్ గా భావించి వెంటనే ఒప్పేసుకున్నారుట. ఆల్రెడీ ప్రూవెడ్ సినిమా, శంకర్ లాంటి పెద్ద దర్సకుడు వీటికి తోడు షూటింగ్ డేస్ తక్కువ అనేది మహేష్ కి ఈ ప్రపోజల్ లో నచ్చిన విషయం అని చెప్పుకుంటున్నారు. ఇక మహేష్ తో నెలన్నరలో పూర్తి చేసి సంక్రాతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఖలేజా తర్వాత ఈ చిత్రమే రిలీజ్ అవుతుందా లేక శ్రీను వైట్లతో చేస్తున్న దూకుడు ని ముందుకు తీసుకెళ్తే బావుంటుందా అనే ఆలోచనలో మహేష్ ఉన్నారుట. ఇక ఈ చిత్రంలో మహేష్ సరసన ఇలియానా చేస్తోంది.