Don't Miss!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహేష్ నెక్ట్స్ ఆ తమిళ దర్శకుడుతో కన్ఫర్మ్
త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్న చిత్రం మహేష్ తన తదుపరి చిత్రానికి దర్శకుడుగా లింగు స్వామిని ఎంపికచేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. తమిళంలో శింబు హీరోగా చేసే కథని తెలుగులో మహేష్ తో చేయనున్నారు. మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ తిరుపతి ప్రసాద్ ఈ చిత్రం తెలుగు వెర్షన్ ని నిర్మించనున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ చిత్రం షూటింగ్ మొదలుకానుంది. తమిళ వెర్షన్ మాత్రం జూలైనుంచే షూటింగ్ చేస్తారు. ఈ చిత్రం స్క్రిప్టు నిమిత్తం లింగు స్వామి ప్రస్తుతం కూర్గులోని ఆరెంజ్ కంట్రీ అనే రిసార్టులో స్క్రిప్టు వర్క్ చేస్తున్నారు. ఆయన మాట్లాడుతూ...నేను నార్మల్ గా స్క్రిప్టు చేయటానికి ప్రశాంతంగా ఉండే చోటు కావాలనుకుంటాను. ఇప్పుడీ ప్లేస్ నచ్చింది. అలాగే నేను చేయబోయే చిత్రం గురించి మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిర్మాత సమక్షంలో వెళ్లడి చేస్తాను అన్నారు. ఇక లింగు స్వామి డైరక్ట్ చేసిన రన్, పందెం కోడి చిత్రాలు తెలుగులో మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. అలాగే అతని తాజా చిత్రం పయ్యా త్వరలో ఆవారా టైటిల్ తో తెలుగులో రిలీజ్ కాబోతోంది.