Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎట్టకేలకు మహేష్ బాబు కోలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్దం
చెన్నై: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కోలీవుడ్ ఎంట్రీకి ఎట్టకేలకు రంగం సిద్ధ మైంది. మహేష్ నటించిన 'బిజినెస్ మేన్' చిత్రం త్వరలో తమిళంలో విడుదలకు సిద్ధం అవుతోంది. వాస్తవానికి ఈచిత్రం తెలుగుతో పాటు అక్కడ రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ...అనుకోని కారణాలతో చాలా గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం ఈచిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు కానున్నాయి. డబ్బింగ్ పూర్తయ్యాక విడుదల తేదీ ఖరారు చేయనున్నారు.
ఈచిత్రం ద్వారా మహేష్ బాబు తొలిసారి కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇతర హీరోలంతా ఇప్పటికే కోలీవుడ్ మార్కెట్ లోకి అడుగుపెట్టిన నేపథ్యంలో మహేష్ బాబు కూడా అక్కడి మార్కెట్ ను చేజిక్కించుకోవాలనే కసిగా ఉన్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రంలో కాజల్ హీరోయిన్. కాజల్ కు తమిళనాట ఇప్పటికే మంచి పేరుంది. ఈచిత్రంలో ముఖ్య పాత్రలు పోషించిన ప్రకాస్ రాజ్, నాజర్ లాంటి వాళ్లు కూడా తమిళ తంబీలకు సుపరిచితమే. ఈ నేపథ్యంలో ఈచిత్రం అక్కడ మంచి ఫలితాలను సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు నిర్మాతలు.
ప్రస్తుతం మహేష్ బాబు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో నటిస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో వెంకటేష్ మరో హీరోగా నటిస్తున్నారు. మహేష్ సరసన సమంత, వెంకటేష్ సరసన అంజలి నటిస్తున్నారు. వెంకీ-మహేష్ అన్నదమ్ముళ్లుగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే టాలీవుడ్ లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అన్నదమ్ముల రిలేషన్ ఈ చిత్రంలో మెయిన్గా ఫోకస్ కానుంది. ఈ చిత్రం తర్వాత మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో మరో చిత్రం చేయబోతున్నారు.