Don't Miss!
- News టీడీపీ ప్లాన్ బీ- వంగవీటి రాధాకు టికెట్?
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
మణిరత్నం పై రూమర్స్ నమ్మద్దు...: సుహాసిని
చెన్నై : ''మణి ప్రస్తుతం 'కడల్' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇంకా ఏడు రోజుల షూటింగ్ మిగిలే ఉంది. అది పూర్తయిన తరవాత నిర్మాణానంతర కార్యక్రమాలు చూసుకోవాలి. తరవాతి చిత్రం కోసం ఆయన స్క్రిప్టు రాయాలంటే మరో ఎనిమిది నెలలు సమయం పడుతుంది. అంతవరకూ ఆయన తరవాత చిత్రం గురించి ఎలాంటి వార్తలొచ్చినా నమ్మొద్దు'' అని సుహాసిని ప్రకటన చేసారు.
సుహాసిని హఠాత్తుగా ఇలా ప్రకటించటానికి కారణం... మణిరత్నం దర్శకత్వంలో ఐశ్వర్య రాయ్ నటించబోతోందని హిందీలో ఇటీవల ప్రచారం మొదలైంది. 1938లో డఫ్నే డు మారియర్ రాసిన రెబెకా నవల ఆధారంగా ఆ చిత్రం రూపొందబోతోందని కూడా వార్తలొచ్చాయి. ఓ పెద్ద బాలీవుడ్ సంస్ధ ఈ చిత్రాన్ని నిర్మించనుందని ఆ రూమర్స్ లో రాసుకొచ్చాయి. అయితే అందులో నిజం లేదని తేలింది. మణిరత్నం భార్య సుహాసిని ఈ విషయాన్ని మీడియా ద్వారా అభిమానులకు వెల్లడించారు.
మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న తాజా తమిళ చిత్రం 'కడల్'. కార్తీక్ తనయుడు గౌతమ్ హీరో. రాధ చిన్న కుమార్తె తులసి హీరోయిన్. అర్జున్, అరవింద్ స్వామి, మంచు లక్ష్మీప్రసన్న కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో 'కడలి' పేరుతో అనువదిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. సముద్రం నేపథ్యంలో సాగే ప్రేమ కథ ఇది. ఎక్కువ భాగం కేరళలో తెరకెక్కించారు. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. వనమాలి సాహిత్యం సమకూరుస్తున్నారు. నవంబరులో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలున్నాయి. 'కడలి'కి సంబంధించిన పూర్తి వివరాలు దర్శక,నిర్మాతలు త్వరలో వెల్లడిస్తారు.
మంచు లక్ష్మీ ప్రసన్న ఈ చిత్రంలో హీరోయిన్ తల్లిగా కనిపించనుందని సమాచారం. ఈ చిత్రంలో ఆమె యాక్షన్ స్టార్ అర్జున్ కి భార్యగా కనిపించనుంది. ఇద్దరూ మిడిల్ క్లాస్ జంటగా కనిపిస్తారు. వీరి ముద్దులు కూతురు తులసి. తులసి ప్రేమ కథ చుట్టూ కథ జరుగుతుంది. అరవింద్ స్వామి కీ రోల్ లో చేస్తున్న ఈ చిత్రానికి రాజీవ్ మీనన్ కెమెరా వర్క్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ హైలెట్ అని చెప్తున్నారు. జెమిని ఫిల్మ్ సర్క్కూట్ వారు ఈ చిత్రాన్ని రికార్డు స్థాయి ధర చెల్లించి థియేటర్ రైట్స్ సొంతం చేసుకున్నారని సమాచారం. ఈ చిత్రం మద్రాసు టాకీస్ పతాకంపై రూపొందుతున్న 14వ చిత్రం. అలాగే మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న 23వ చిత్రం కావడం విశేషం.