Don't Miss!
- Sports SRH vs RCB: ఫుల్ టాస్కు ఔటైన మార్క్రమ్.. నవ్వు ఆపుకోలేకపోయిన కోహ్లీ!వీడియో
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- News కాలేజ్ అమ్మాయి ఇంటికి వెళ్లిన సీఎం, పోలింగ్ కు ఒక్కరోజు ముందు ప్రతిపక్షాలకు ఝలక్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'ఎటో వెళ్లిపోయింది మనస్సు' నెగిటివ్ టాక్ పై మణిరత్నం
చెన్నై: నాని, సమంత జంటగా గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో రూపొంది, విడుదలైన చిత్రం 'ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ చిత్రం బాగోలేదని నెగిటివ్ టాక్ వచ్చింది. అలాగే రివ్యూలు కూడా చాలా దారుణంగా వచ్చాయి. దాంతో గౌతమ్ మీనన్ చాలా బాధపడ్డారట. ఆయన తను ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో ఈ సినిమా బెస్ట్ అని, కానీ రెస్పాన్స్ చూసి బాధపడుతున్నానని, చాలా డిజప్పాయింట్ అయ్యాయని, మణిరత్నంకు మెసేజ్ పెట్టారు. దానికి మణిరత్నం స్పందిస్తూ... నీ పనిని నువ్వు సిన్సియార్టిగా చేసానని నమ్మకం ఉన్నప్పుడు దాని గురించి ఆలోచించటం అనవసరం.. నువ్వు నీ నెక్ట్ట్ ప్రాజెక్టులోకి వెళ్ళిపో అని సూచించారట. ఈ విషయాన్ని దర్శకుడు గౌతమ్ మీనన్ స్వయంగా ఓ టీవీ షో లో తెలియచేసారు.
సమంత మాట్లాడుతూ... ''నిత్యలాంటి పాత్ర మళ్లీ నాకు దొరకదు. ఆ పాత్రకు ఇంత స్పందన వస్తుందని ఊహించలేదు. ఇలాంటి మంచి సినిమాలో నటించినందుకు గర్వపడుతున్నా'' అని సమంత చెప్పింది. 'ప్రస్తుతం అయిదు తెలుగు సినిమాలు, ఒక బాలీవుడ్ సినిమా తన చేతిలో ఉన్నాయని, ఇటీవల విడుదలైన 'ఎటో వెళ్లిపోయింది మనసు' తెలుగులో తన అయిదవ విజయమని ఆనందం వ్యక్తం చేసింది సమంత.
నాని మాట్లాడుతూ... ''స్కూలు, కాలేజీలు మానేసి మరీ విద్యార్థులు మా సినిమా చూస్తున్నారు. నెమ్మదిగా ప్రేక్షకులకు చేరువవుతోంది. ఈ సినిమాలో సమంతని ముద్దుపెట్టుకొన్న సన్నివేశం ఉంది. అది నిజం ముద్దు కాదు. మాయ చేశామంతే'' అన్నారు . అలాగే ''నేను, నా శ్రీమతి, మా మావయ్య ఈ సినిమాకెళ్లాం. సమంతతో ముద్దు సన్నివేశం వచ్చినప్పుడు కాస్త కంగారుపడ్డాను. 'వీళ్లు ఎలా అర్థం చేసుకొంటారో' అని. అది నిజం ముద్దు కాదని నా శ్రీమతికి తెలుసు. తనే వాళ్ల నాన్నకి చెప్పింది. 'నువ్వయితే మిస్ అయ్యావుకానీ, నేనైతే పెట్టుకొందును' అని ఆయన చమత్కరించారు. నా జీవితంలో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది''అన్నారు.
'ఈ విజయంలో అందరి కృషీ ఉంది. నాని, సమంత చక్కటి నటన ప్రదర్శించారు. సాధారణ సన్నివేశాన్ని కూడా రక్తికట్టించారు. ఇళయరాజా సంగీతం లేకపోతే ఈ సినిమా లేదు. ఆయన పాటలు విని స్ఫూర్తి పొందాను''అన్నారు దర్శకుడు. ''నాని తపన, దర్శకుడి కృషి.. ఈ విజయానికి కారణమ''ని నిర్మాత సి.కల్యాణ్ చెప్పారు.