Don't Miss!
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
'ఎటో వెళ్లిపోయింది మనస్సు' నెగిటివ్ టాక్ పై మణిరత్నం
చెన్నై: నాని, సమంత జంటగా గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో రూపొంది, విడుదలైన చిత్రం 'ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ చిత్రం బాగోలేదని నెగిటివ్ టాక్ వచ్చింది. అలాగే రివ్యూలు కూడా చాలా దారుణంగా వచ్చాయి. దాంతో గౌతమ్ మీనన్ చాలా బాధపడ్డారట. ఆయన తను ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో ఈ సినిమా బెస్ట్ అని, కానీ రెస్పాన్స్ చూసి బాధపడుతున్నానని, చాలా డిజప్పాయింట్ అయ్యాయని, మణిరత్నంకు మెసేజ్ పెట్టారు. దానికి మణిరత్నం స్పందిస్తూ... నీ పనిని నువ్వు సిన్సియార్టిగా చేసానని నమ్మకం ఉన్నప్పుడు దాని గురించి ఆలోచించటం అనవసరం.. నువ్వు నీ నెక్ట్ట్ ప్రాజెక్టులోకి వెళ్ళిపో అని సూచించారట. ఈ విషయాన్ని దర్శకుడు గౌతమ్ మీనన్ స్వయంగా ఓ టీవీ షో లో తెలియచేసారు.
సమంత మాట్లాడుతూ... ''నిత్యలాంటి పాత్ర మళ్లీ నాకు దొరకదు. ఆ పాత్రకు ఇంత స్పందన వస్తుందని ఊహించలేదు. ఇలాంటి మంచి సినిమాలో నటించినందుకు గర్వపడుతున్నా'' అని సమంత చెప్పింది. 'ప్రస్తుతం అయిదు తెలుగు సినిమాలు, ఒక బాలీవుడ్ సినిమా తన చేతిలో ఉన్నాయని, ఇటీవల విడుదలైన 'ఎటో వెళ్లిపోయింది మనసు' తెలుగులో తన అయిదవ విజయమని ఆనందం వ్యక్తం చేసింది సమంత.
నాని మాట్లాడుతూ... ''స్కూలు, కాలేజీలు మానేసి మరీ విద్యార్థులు మా సినిమా చూస్తున్నారు. నెమ్మదిగా ప్రేక్షకులకు చేరువవుతోంది. ఈ సినిమాలో సమంతని ముద్దుపెట్టుకొన్న సన్నివేశం ఉంది. అది నిజం ముద్దు కాదు. మాయ చేశామంతే'' అన్నారు . అలాగే ''నేను, నా శ్రీమతి, మా మావయ్య ఈ సినిమాకెళ్లాం. సమంతతో ముద్దు సన్నివేశం వచ్చినప్పుడు కాస్త కంగారుపడ్డాను. 'వీళ్లు ఎలా అర్థం చేసుకొంటారో' అని. అది నిజం ముద్దు కాదని నా శ్రీమతికి తెలుసు. తనే వాళ్ల నాన్నకి చెప్పింది. 'నువ్వయితే మిస్ అయ్యావుకానీ, నేనైతే పెట్టుకొందును' అని ఆయన చమత్కరించారు. నా జీవితంలో ఈ సినిమా ఓ మైలురాయిగా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది''అన్నారు.
'ఈ విజయంలో అందరి కృషీ ఉంది. నాని, సమంత చక్కటి నటన ప్రదర్శించారు. సాధారణ సన్నివేశాన్ని కూడా రక్తికట్టించారు. ఇళయరాజా సంగీతం లేకపోతే ఈ సినిమా లేదు. ఆయన పాటలు విని స్ఫూర్తి పొందాను''అన్నారు దర్శకుడు. ''నాని తపన, దర్శకుడి కృషి.. ఈ విజయానికి కారణమ''ని నిర్మాత సి.కల్యాణ్ చెప్పారు.