Don't Miss!
- News తెలంగాణలో వచ్చే రెండు రోజులు వానలు: ఆ తర్వాత తీవ్రమైన ఎండలు, ఎల్లో అలర్ట్
- Sports ఆ భారత కుర్రాడు మామూలోడు కాదు- లారా
- Technology స్మార్ట్వాచ్ సెగ్మెంట్లోకి ప్రముఖ సంస్థ.. 8 రోజుల బ్యాటరీ లైఫ్, హెల్త్ ట్రాకర్లతో ProWatch విడుదల..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
యమా క్రేజ్ గా మణిరత్నం-సుహాసిని ర్యాంప్ వాక్!
మణిరత్నం, సుహాసిని ఈ దంపతులు కలిసి కనిపించటమే చాలా తక్కువ కాగా ఈ ఇద్దరూ కలిసి ఓ షోలో ర్యాంప్ మీద వాక్ చేస్తే యమా క్రేజ్ వస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రముఖ డిజైనర్ సంజనా సాషే ఆడపిల్లలను కాపాడాలి అనే ప్రచారంతో కొన్ని షోలు చేస్తోంది. ఈ షోలు ఇప్పటికే ఢిల్లీలో జరిగాయి. ముంబై, చెన్నైల్లో కూడా ఈ షోలు చేసి ప్రజల్లో ఆడ శిశువులను చంపకూడదు అనే మెసేజ్ ని తెలియజేయటానికి సంజనా పాటు పడుతోంది. ఇది చాలా మంచి ప్రయత్నం కాబట్టి డైరెక్టర్ మణిరత్నం, నటి సుహాసినిలు ఈ షోలో పాల్గొని ర్యాంప్ వాక్ చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారమ్. డిసెంబర్ లో ఈ షో చెన్నై లో జరపటానికి సంజనా ప్లాన్ చేస్తోందని వినికిడి.
ఈసందర్బంగా సంజనా మాట్లాడుతూ మణిరత్నం అతని భార్య సుహాసిని నా ప్యాషన్ షోలో ఒక భాగమన్నారు. వీరు మా షోకి మంచి ఆకర్షన అని ప్రసంశించారు. నేను చేసిన చివరి షో 'సేవ్ ద గర్ల్ చైల్డ్" ఢిల్లీ లో జరిగింది. ఇప్పుడు చెన్నైలో ప్లాన్ చేస్తున్నామన్నారు. ఇంకా మరి కొందరు బాలివుడ్ స్టార్ కూడా ఇందు లో పాల్గొంటారాని చెప్పారు. ఈ షోలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కూడా పాల్గొంటున్నారని తెలియజేశారు.