Don't Miss!
- Automobiles విమానంలో ప్రేమ కావ్యం.. అద్భుతమైన సన్నివేశానికి ఫిదా అవుతున్న నెటిజన్లు
- Finance Uday Kotak: కోటక్ బ్యాంక్ స్టాక్ క్రాష్.. పాపం ఉదయ్ కోటక్.. ఎంత నష్టపోయారంటే..
- Sports కోహ్లి.. అసలు ఇదేం బ్యాటింగ్- సునీల్ గవాస్కర్
- News రేవంత్ రెడ్డి సీటుకు భలే డిమాండ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
శ్రీదేవి, టబు వర్కవుట్ కాక మనీషా కొయరాల
మొదట్లో మాఫిళ్ళై చిత్రంలో హీరో ధనుష్ అత్త పాత్రకు శ్రీదేవి, టబు, జయప్రధలను ట్రై చేసారు కానీ వర్కవుట్ కాలేదు. అప్పుడు మనీషా కొయరాలా సీన్ లోకి వచ్చింది. హన్సిక, ధనుష్ కాంబినేషన్లో రూపొందుతున్న మాప్పిళ్ళై చిత్రం రీమేక్ లో మనీషా కొయరాల...హన్సికకు తల్లిగా నటిస్తోంది. ఈ విషయం వివరిస్తూ హన్సిక...మనీషా వంటి గొప్ప ఆర్టిస్టుతో స్క్రీన్ స్పేస్ పంచుకోవటం అనేది గొప్ప అదృష్టం..అది నేను పొందుతున్నాను..ఇది నిజం అంటూ ఎక్సైట్మెంట్ తో చెప్పింది. ఇక మనీషా కొయరాల రీసెంట్ గా నయనతార తల్లిగా ఎలక్ట్రా అనే మళయాళ చిత్రంలో చేస్తోంది.
జాతీయ అవార్డు గ్రహీత శ్యామ్ ప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ చిత్రంలో మనీషా చేస్తున్న పాత్ర ప్రత్యేకమైన గుర్తింపు కలిగి ఉంటుందంటున్నారు. మాపిళ్ళై చిత్రాన్ని సన్ పిక్చర్స్ వారు సూరజ్ అనే దర్శకుడు డైరక్షన్ లో నిర్మిస్తున్నారు. మనీషా కొయరాల క్యారెక్టర్ పొగరుమోతు అత్తగా కనిపిస్తుంది. ధనుష్ ఆమెకు అల్లుడుగా చేస్తున్నారు. ఈ చిత్రం 1989లో రజనీకాంత్ హీరోగా ఇదే టైటిల్ తో వచ్చి హిట్టయింది. ఈ అత్తా అల్లుళ్ళ కథ అప్పట్లో సంచలనం సృష్టించింది.