Don't Miss!
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మెగాస్టార్ చిరు, సూపర్ స్టార్ రజనీ, మినీ స్టార్ ధనుష్!
తెలుగులో చిరంజీవి, విజయశాంతి, వాణీశ్రీ నటించిన 'అత్తకు యముడు-అమ్మాయికి మొగుడు" చిత్రాన్ని తమిళంలో రజనీకాంత్ తో 'మాపిళ్లై" పేరుతో రీమేక్ చేయగా అక్కడ కూడా ఘన విజయం సాధించింది. రజనీకి అత్తగా శ్రీవిద్య, భార్యగా అమల నటించిన ఈ చిత్రాన్ని అదే పేరుతో రజనీ అల్లుడు ధనుష్తో పునర్నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
ఈ చిత్రంలో అత్తగారి పాత్రకు తొలుత జయప్రదను, తర్వాత శ్రీదేవిని తీసుకుందామనుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల వారిద్దరూ ఆ సినిమా చేసేందుకు కుదరకపోవడంతో..సిమ్రాన్ తీసుకున్నారనే వార్తలు సైతం వచ్చాయి. అయితే..ఆ పాత్రను చివరికి నేపాలీ బ్యూటి గతంలో 'రజనీకాంత్" సరసన 'బాబా" చిత్రంలో చేసిన మనీషా కొయిరాలాను వరించిందని తెలుస్తోంది.
ఈ చిత్రంలో ధనుష్ సరసన హన్సిక నటిస్తుంది. త్వరలోనే సెట్స్ పైకి సిద్దమవుతున్న ఈ చిత్రంలో థనుష్ ఓ వైరైటీ లుక్ తో కనిపిస్తాడని కూడా వార్తలు వస్తున్నాయి. సో మెగాస్టార్ చిరు, సూపర్ స్టార్ రజనీ నటించి రెండు సార్లు విజయం సాధించిన ఈ చిత్రం ఇప్పుడు ధనుష్ కి విజయవంతం అవుతుందంటారా!