Don't Miss!
- Automobiles ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
విశాల్ కి విలన్స్ గా మారిన వర్మ హీరోలు
రామ్ గోపాల్ వర్మ సూపర్ హిట్ చిత్రం సత్య లో చేసిన జెడీ చక్రవర్తి,మనోజ్ బాజపేయ్ లను మర్చిపోవటం కష్టమే. వాళ్ళిద్దరూ ఇప్పుడు జంటగా విశాల్ చిత్రంలో విలన్స్ గా కనపించనున్నారు. సమరన్ పేరిట నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని తిరు డైరక్ట్ చేస్తున్నారు. త్రిష హీరోయిన్ గా చేస్తోంది. యవన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని విక్రమ్ కృష్ణ నిర్మిస్తున్నారు. ధాయలాండ్ లో ఈ చిత్రం యాభై రోజులు పాటు చిత్రీకరించారు.
ఈ సమ్మర్ లో తెలుగు, తమిళ వెర్షన్ లు విడుదల చేస్తున్నారు.. మరో ప్రక్క విశాల్ తెలుగు చిత్రం కిలాడి పెద్ద ప్లాప్ గా నమోదైంది. తమిళంలోనూ పెద్దాగ ఆడని ఆ సినిమా తెలుగు వెర్షన్ సైతం ప్రేక్షకులను అలరించలేకపోయింది. అంతేగాక తెలుగులో వాడు వీడు చిత్రం కూడా పెద్దగా ఆడకపోవటం, అవార్డు ఆశిస్తే అదీ రాకపోవటం నిరాశపరిస్తుంది. ఇక రీసెంట్ గా విశాల్ ఓ ప్రేమ వ్యవహారంలో మునిగి తేలుతున్నాడని వార్తలు వచ్చాయి. అయితే తనపై వస్తున్నవన్ని రూమర్సేనని, తాను తమిళ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మిని ప్రేమించలేదని హీరో విశాల్ స్పష్టం చేసారు.అయితే తాను ఆమెను గత ఇరవై ఏళ్లుగా ఎరుగుదునని అన్నారు.
మేము జస్ట్ ప్రెండ్స్ మి మాత్రమే.మేమంతా ఎన్నో సార్లు డిన్నర్స్ కి కలిసి వెళ్ళాం.సినిమాలు కలిపి చూసాం.అయితే ఆ సమయంలో మేమిద్దరమే ఉండము.మా గ్యాంగ్ అంతా ఉంటుంది. అది గమనించిన వాళ్ళే అపార్ధం చేసుకుని ఉంటారనుకుంటున్నాను అని తేల్చి చెప్పాడు. అలాగే నేను ప్రస్తుతం సింగిల్ గానే ఉన్నాను.
నాకు గర్ల్ ప్రెండ్ ఉంటే తప్పనిసరిగా ఆమె పేరు బయిటకి వస్తే సంతోషమే కానీ అస్సలు ఆ విధమైన రిలేషనే లేకుండా వార్తలు రావటం వింతగా ఉంది అన్నాడు.ఇక నా జీవితంలో ఏ అమ్మాయి లేదు అని స్పష్టం చేసాడు. అలాగే శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి కూడా హీరోయిన్ గా ఓ చిత్రంలో చేస్తోంది. తెలుగులో రాధా మోహన్ దర్సకత్వంలో రూపొందే నాగచైతన్య చిత్రంలో ఆమెనే హీరోయన్.