twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరీ ఇంత 'మర్మం' అయితే ఎలా కమల్?

    By Staff
    |

    Kamal Hassan
    కమల్ హాసన్ ప్రతిష్టాత్మకంగా రూపొందించ తలపెట్టిన మర్మయోగి సినిమా ఫొటో సెషన్ చెన్నైలో ప్రారంభమయ్యింది. శ్రియ,త్రిష,హేమమాలిని మాత్రమే కాకుండా మరికొంతమంది తారాగణం ఈ సెషన్ లో పాలుపంచుకోనున్నారు. ఈ సెషన్ ని ఎ.వి.యం స్టూడియోస్ లో జరుపుతున్నారు. హెవీ సెక్యూరిటీ మధ్య, మొబైల్స్ లోపలకి తీసుకెళ్ళకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుని ఈ సెషన్ నిర్వహిస్తున్నారు. కమల్ దర్శకత్వం వహించి నటిస్తూండటంతో ఆయనకు ఊపిరిసలపని పని ఉంటోందిట.

    ఫొటో సెషన్ కి అటెండయ్యేవారు తప్ప మిగితావారుని లోపలకి రానివ్వలేదుట. అలాగే కమల్ సెంటిమెంటుగా భావించే ఎర్ర రంగు కెమెరా ని ఈ సెషన్ కోసం ఉపయోగిస్తున్నారు.ఇక ఈ చిత్రంలో ఆయన ప్రత్యేక గెటప్ కోసం ఫారిన్ నుండి మేకప్ నిపుణులు రప్పించటం జరిగింది. అలాగే ఓ ఫారిన్ కెమెరామెన్ ఈ సెషన్లో ప్రధాన భూమిక నిర్వహిస్తున్నారు. ఇక ఈ సెషన్ రెండు వారాలు దాకా కొనసాగుతుందని తెలుస్తోంది. అలాగే ఫొటో సెషన్ కే ఇంత భారీగా ఏర్పాట్లు చేస్తే షూటింగ్ కి ఇంకెంత హంగామా చేస్తోడో అని చెన్నై వాసులు చెప్పుకుంటున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X