Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎస్పీబీ కోసం సామూహిక ప్రార్థన.. హీరో కార్తీ, జీవీ ప్రకాష్ ట్వీట్స్
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో పోరాడుతున్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడం, అది కాస్తా సీరియస్ అవ్వడం, ఐసీయూ నుంచి వెంటిలేటర్పైకి తరలించడం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎస్పీబీ ఆరోగ్యం కాస్త కుదుటపడుతూనే ఉందని ఎస్పీ చరణ్ మీడియాతో చెప్పుకొచ్చారు. బాలు ఆరోగ్యంపై యావత్ భారత సంగీత ప్రియులంతా ఆందోళన చెందుతున్నారు.
ఎస్పీబీ త్వరగా కోలుకోవాలని, సామూహిక ప్రార్థనలు చేయాలని మన తెలుగు సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ వంటి వారు ముందడుగు వేశారు. చంద్రబోస్, చిరంజీవి, ఇళయ రాజా, ఏఆర్ రెహ్మాన్, రజినీ కాంత్, కమల్ హాసన్ వంటి వారంతా బాలు ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. ఈక్రమంలో సామూహిక ప్రార్థనలపై హీరో కార్తీ, సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ స్పందించారు.
హీరో కార్తీ స్పందిస్తూ.. 'మనకు ఎంతో ప్రియమైన ఎస్పీబీ సర్ త్వరగా కోలుకోవాలని, రేపు (ఆగస్ట్ 20) సాయంత్రం ఆరు గంటల నుంచి ఆరు గంటల ఐదు నిమిషాల వరకు సామూహికంగా ప్రార్థనలు చేద్దాం. మేమంతా మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాము ఎస్పీబీ సర్' అంటూ చెప్పుకొచ్చాడు.
ఎస్పీబీ ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని వెంటనే కోలుకోవాలని సామూహిక ప్రార్థనాలు చేద్దాం. ఆగస్ట్ 20 సాయంత్రం ఆరు గంటలకు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనండి. మళ్లీ మనమంతా ఆయన గొంతును వినేలా చేద్దాం. త్వరగా కోలుకోండి ఎస్పీబీ సర్ అంటూ జీవీ ప్రకాశ్ కుమార్ ట్వీట్ చేశాడు.