Don't Miss!
- News జైల్లో చిప్పకూడే.: కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
- Automobiles గిఫ్ట్ అంటే అబ్బాయిలే ఇవ్వాలా.??.. పెళ్లిలో వరుడికి వధువు అదిరిపోయే బైక్ గిఫ్ట్.. వైరల్ వీడియో చూసేయండి
- Sports RCB vs KKR: సారీ.. మా ఆటగాళ్ల పేర్లు మరిచిపోయా: శ్రేయస్ అయ్యర్ వీడియో
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
టాలీవుడ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టిన మాస్టర్ కాంబో.. వచ్చే ఏడాది రెండు సినిమాలు
టాలీవుడ్ ఇండస్ట్రీలో పరభాషా హీరోలు ఒక్క హిట్టు కొట్టినా చాలు వారికంటూ ఒక మార్కెట్ సెట్టవ్వడం కాయం. సరిగ్గా ఒక నాలుగైదు సినిమాలతో హిట్టు కొట్టాలే గాని బాక్సాఫీస్ వద్ద వాళ్ళు కూడా ఒక సెన్సేషన్ ను క్రియేట్ చేస్తారు. ఇక రజినీకాంత్ తరువాత తమిళనాడులో అత్యదిక ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్న వారిలో విజయ్ ఒకరు. ఒక విధంగా దళపతి మార్కెట్ ఇప్పుడు అంతకంతకు పెరుగుతూనే ఉంది.
ఇక మాస్టర్ సినిమాతో మొత్తానికి తెలుగులో కూడా బాక్సాఫీస్ హిట్ అందుకున్న విజయ్ ఆ సినిమా ద్వారా సెట్టయిన మార్కెట్ వాల్యును నెక్స్ట్ సినిమాతో మరింత పెంచాలని ఫిక్స్ అయ్యాడు. విజయ్ డైరెక్ట్ తెలుగు సినిమా చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక విజయ్ కు ఇప్పటికే తెలుగు నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్ వారు అడ్వాన్స్ ఇచ్చేశారు. వచ్చే ఏడాది తప్పకుండా సినిమా చేసేందుకు కమిట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇక మాస్టర్ దర్శకుడు లోకేష్ కనగరాజన్ కూడా తెలుగు మార్కెట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టాడు. తెలుగులో ఖైదీ, మాస్టర్ రెండు కూడా అతని వాల్యుని పెంచేశాయి. ఇక విజయ్ తో పాటు అతను కూడా త్వరలో ద్విభాషా సినిమా చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది లోకేష్ తో పాటు విజయ్ కు సంబంధించిన సినిమాలను తెలుగులో డైరెక్ట్ గా రిలీజ్ చేస్తారని టాక్. మరి ఈ ఇద్దరు ఎంతవరకు హిట్ అందుకుంటారో చూడాలి.