Don't Miss!
- Finance IREDA: భారీగా లాభాలను ప్రకటించిన ఐఆర్ఈడీఏ..
- Sports సూపర్ మ్యాన్ జడేజా: గాల్లోకి డైవ్ చేస్తూ ఒంటిచేత్తో క్యాచ్ Video
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Technology Dell నుంచి నాలుగు కొత్త Ai ల్యాప్టాప్లు! ధర,స్పెసిఫికేషన్లు
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
రీ ఎంట్రీ అదుర్స్: స్టార్ హీరోకు భార్యగా మీనా
చెన్నై : పెళ్లి తర్వాత వెండితెరకు దూరమైన మీనా.. ఆ మధ్య 'తంబిక్కోట్త్టె'లో మళ్లీ కనిపించింది. అంతేకాకుండా బుల్లితెరపై కొన్ని కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా కూడా వస్తోంది. తాజాగా ఆమె మలయాళ చిత్ర పరిశ్రమపై దృష్టిపెట్టింది. ఏకంగా మోహన్లాల్కు జంటగా నటిస్తోంది. ఈ సినిమాకు 'దృశ్యం' అని పేరు పెట్టారు. క్రిస్మస్ కానుకగా రెండు రోజుల క్రితం విడుదల అయ్యి...ఈ చిత్రం విజయం సాధించింది. ఇందులో మోహన్లాల్కు భార్యగా ఆమె నటించారని.. ఆమె నటనలో మరో కోణాన్ని ప్రేక్షకులు చూడొచ్చని దర్శకుడు చెబుతున్నారు.
మీనా మాట్లాడుతూ.. ''కుటుంబ కథా చిత్రమిది. అన్నివర్గాల ప్రేక్షకులకూ నచ్చుతుంది. మళ్లీ మలయాళ ప్రేక్షకులను పలకరించడం ఆనందంగా ఉంది''అని చెప్పింది. ఈ సినిమా కోసం అమ్మడు కేరళలో బస చేస్తోందట. అవకాశాలు వస్తే వెంటనే అందిపుచ్చుకోవాలంటే అక్కడే ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ చిత్రం మోహన్ లాల్ కి పెద్ద బ్రేక్ ఇచ్చిన సినిమాగా చెప్తున్నారు. అలాగే మీనా..చిత్రంలో ఇద్దరి బిడ్డల తల్లిగా చేసింది. ఆమెకు కూడా టర్నింగ్ పాయింట్ అంటున్నారు.
ఇక, ఆ మధ్య విడుదలైన 'శ్రీ జగద్గురు ఆదిశంకర'లో ఆమె ఓ పాత్ర చేసిన విషయం తెలిసిందే. విద్యాసాగర్ని పెళ్లి చేసుకుని, ఓ బిడ్డకు తల్లయిన తర్వాత మీనా రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు వరుసగా సినిమాలు అంగీకరిస్తున్నారు కాబట్టి కెరీర్ని సీరియస్గా తీసుకుంటున్నారని ఊహించవచ్చు.
మరో ప్రక్క మీనా డబ్బింగ్ ఆర్టిస్టుగా కొత్త అవతారమెత్తి తన పయనాన్ని సాగిస్తున్నారు. బాలనటిగా కెరీర్ను ప్రారంభించిన మీనా అప్పట్లో తెలుగు, తమిళంలో నెంబర్ వన్ హీరోయిన్గా కొనసాగారు. రజనీకాంత్, కమల్హాసన్, సత్యరాజ్, ప్రభు, అజిత్ వంటి అగ్రహీరోలతో ఆడిపాడి ప్రేక్షకులను విశేషంగా అలరించారు. వివాహానంతరం మీనా వెండితెరకు దూరమయ్యారు. ప్రస్తుతం బుల్లితెరపై హవా చాటుకుంటున్నారు. ఇదిలా ఉంటే కోలీవుడ్లో డబ్బింగ్ ఆర్టిస్టుగా తన కొత్త పయనాన్ని సాగిస్తున్నారు.
సంచలనాత్మక విజయం సాధించిన 'మైనా' చిత్రంలో టైటిల్రోల్ పోషించిన అమలాపాల్కు తమిళంలో గాత్రాన్ని అందించింది మీనానే! సంభాషణల పరంగా మైనా పాత్ర బాగా అలరించిన నేపథ్యంలో ఆమెకు ఈ తరహా అవకాశాలూ బాగానే వస్తున్నాయట. ప్రస్తుతం శివాజీ గణేశన్ కుటుంబం నుంచి ప్రభు నట వారసుడిగా విక్రమ్ప్రభు తెరంగేట్రం చేయనున్న గుమ్కీలో హీరోయిన్ లక్ష్మీమీనన్కూ మీనా డబ్బింగ్ చెప్పింది.