రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన స్వామీజీపై హీరోయిన్ ప్రేమ.. అతనంటే అంత కసి ఎందుకు పాప?
కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో కాంట్రవర్సీ కామెంట్స్ తో నిత్యం హాట్ టాపిక్ గా నిలుస్తున్న మీరా మిథున్ మరోసారి కాంట్రవర్సీ స్వామీజీ నిత్యానంపై ప్రేమను వలకబోసింది. అత్యాచారం, ఇతర కేసులలో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న స్వామీజీపై పాజిటివ్ కామెంట్స్ చేయడంతో నెటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికే ఎంతగానో క్రేజ్ తెచ్చుకున్నావ్, ఇక అతని దగ్గరకి వెళితే.. ఇంకా ఫేమస్ అవుతావ్ అని కౌంటర్స్ ఇస్తున్నారు.

హీరో, హీరోయిన్స్ పై కాంట్రవర్సీ కామెంట్స్
మీరా మిథున్ రీసెంట్ గా విజయ్, సూర్యలను టార్గెట్ చేస్తూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. హీరోయిన్ త్రిష తనకు అవకాశాలు రాకుండా కూడా చేస్తోంది అంటూ ఆమెకు కోలీవుడ్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయని కామెంట్స్ చేసింది. దీంతో అభిమానులు ఆమెపై ట్రోలింగ్ మొదలుపెట్టారు.

నిత్యానందపై ఆమె ప్రేమ..
ఇక ఇప్పుడు పలు అత్యాచార ఆరోపణలు ఎదుర్కొని జైలుకు కూడా వెళ్లి వచ్చిన నిత్యానందపై ఆమె ప్రేమను చూపడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతను చాలా గొప్పవాడు అంటూ ఆయన కోసం నేను ఎంతో ప్రేమను దాచను త్వరలోనే ఆ ప్రేమను ఇస్తానని అనుకుంటున్నట్లు మీరా సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది.

త్వరలోనే చాలా ప్రేమతో..
అందరూ అతన్ని ఎగతాళి చేస్తారు. అంతే కాకుండా ఇష్టం ఉన్నట్లు తిడతారు. ప్రతి మీడియా కూడా అతనికి వ్యతిరేకంగానే ఉంది. కానీ అతను ఈ రోజు ఒంటరిగా నిలబడి ఒక దేశాన్ని సృష్టించుకున్నాడు. కైలాసం అనే కంట్రీని నిర్మించి బలంగా ఎదుగుతున్నడు. త్వరలోనే చాలా ప్రేమతో ఆ కైలాసంను సందర్శించాలని అనుకుంటున్నాను.. అని మీరా ట్వీట్ చేసింది.
Recommended Video

రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన..
మీరా చేసిన ట్వీట్ పై మరోసారి నెటిజన్స్ వారి ప్రతాపాన్ని చూపిస్తున్నారు. రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన ఆ స్వామిజిపై అత్యాచారం కేసులు కూడా ఉన్నాయి. అలాంటి వ్యక్తి అంటే నీకు అంత ప్రేమ కసి ఎందుకు పాప అంటూ ఓ వర్గం నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా ఫేమస్ అయ్యావ్ అతని దగ్గరకి వెళితే.. ఇంకా ఫేమస్ అవుతావ్ అని కౌంటర్స్ కూడా ఇస్తున్నారు.


Click it and Unblock the Notifications











