బ్రేకింగ్.. రజనీకాంత్ చిత్రంలో మేఘా ఆకాశ్!
కాలా చిత్రాన్ని ఓ వైపు రిలీజ్కు రెడీ చేస్తూనే మరో సినిమాను సూపర్స్టార్ రజనీకాంత్ పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాలా తర్వాత యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ రూపొందించే చిత్రానికి రజనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తున్నది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త తమిళ సినీ వర్గాల్లో వైరల్గా మారింది.
రజనీ తదుపరి చిత్రంలో బాబీ సింహ, సనంత్రెడ్డి నటిస్తున్నారనే వార్తపై ఓ పక్క చర్చ జరుగుతుండగానే, మరో పక్క ఈ చిత్రంలో యువ హీరోయిన్ మేఘా ఆకాశ్ నటిస్తున్నట్టు న్యూస్ వెలువడింది. ప్రస్తుతం ఎనాయ్ నొక్కి పాయుమ్ తొట్ట అనే చిత్రంలో ధనుష్ సరసన మేఘా ఆకాశ్ హీరోయిన్గా నటిస్తున్నది. అయితే అధికారికంగా ప్రకటన వెలువడలేదు.

రాజకీయాల్లో క్రీయాశీలక పాత్ర పోషించడానికి సిద్ధమవుతున్న రజనీకి ఇదే ఆఖరి చిత్రమవుతుందా అనే చర్చ జరుగుతున్నది. విజయ్ సేతుపతి విలన్గా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ను ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేసే ప్లాన్తో చిత్ర యూనిట్ ముందుకెళ్తున్నది.


Click it and Unblock the Notifications











