Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
అర్జున్కు 50 ప్రశ్నలు.. ఒంటిపై గిల్లి, కౌగిలించుకున్నది నిజం కాదా?
Recommended Video
సీనియర్ హీరో అర్జున్ కు మీటూ ఆరోపణల సమస్యలు ఎక్కువయ్యాయి. తనని వేధించాడంటూ నటి శృతి హరిహరన్ అర్జున్ పై కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీనితో పోలిసుల నుంచి అర్జున్ కు నోటీసులు అందాయి. విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించడంతో అర్జున్ ఇటీవల కబ్బన్ పార్కు పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు అర్జున్ కు పలు ప్రశ్నలు సంధించినట్లు ప్రచారం జరుగుతోంది.
ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం నిజం కాదా
ప్రెసిడెన్సీ కాలేజీ ఆవరణలో జరిగిన షూటింగ్ లో నటి శృతి హరిహరన్ ని వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమె ఒంటిపై గిల్లి, బలవంతంగా కౌగిలించుకున్నది నిజం కాదా అని పోలీసులు అర్జున్ ని ప్రశ్నించారు. ఆమెని తాను అసభ్యంగా తాకలేదు అని అర్జున్ పోలీసులకు సూటిగా సమాధానం ఇచ్చారు.
ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రెస్టారెంట్ కు రమ్మని
బెంగుళూరులోని దేహనపల్లి ట్రాఫిక్ సిగ్నల్ వద్ద శృతిని కలిసింది నిజం కాదా.. రెస్టారెంట్ లో సరదాగా గడుపుదాం రా అని బలవంత పెట్టింది నిజం కాదా.. రాకుంటే నీ కెరీర్ కు ఇబ్బందులు తప్పవు అనిబెదిరించింది వాస్తవం కాదా అంటూ అర్జున్ పై పోలీసులు ప్రశ్నలపై ప్రశ్నలు సంధించారు. మీరడుగుతున్న ప్రశ్నల్లో ఒక్క విషయం కూడా జరగలేదని అర్జున్ సమాధానం ఇచ్చాడు.
రూమ్కి రమ్మని పిలిచి
శృతి ఒంటరిగా కూర్చుని ఉన్న సమయంలో రూమ్ కు రమ్మని బలవంత పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి మీ సమాధానం అని ప్రశ్నించగా ఆరోణలని అర్జున్ ఖండించారు. అకారణంగా తనపై ఆమె నిందలు వేస్తోంది అంటూ బదులిచ్చారు.
నేనేంటో వాళ్ళకి తెలుసు
విచారణ పూర్తయిన తరువాత అర్జున్ మీడియాతో మాట్లాడారు. తనకు కోర్టులో న్యాయం జరుగుతుందని తాను నమ్ముతున్నట్లు అర్జున్ తెలిపారు. నేనేంటో న కుటుంబ సమానమైన అభిమానులకు తెలుసు అని అర్జున్ అన్నారు. అర్జున్ కూడా శృతి హరిహరన్ పై పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.