Don't Miss!
- Sports RR vs DC: అందుకే పృథ్వీ షాను తీసుకోలేదు: రిషభ్ పంత్
- News హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదగా గ్రాండ్గా రీలాంచ్ అయిన CMR షాపింగ్ మాల్
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
శింబుపై కేసు నమోదు.. రూ.20 కోట్లు ఇప్పించాలని డిమాండ్
శింబు సహకరించకపోవడం వల్లే తాము తీవ్ర నష్టాలకు లోనయ్యామని నిర్మాత మైఖేల్ రాయప్పన్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో నిర్మాత మరింత ముందుకెళ్లి శింబుపై కేసు నమోదు చేశాడు. శింబుతో అధిక్ రవిచంద్రన్ రూపొందించిన అంబనవన్ అందగాదవన్ అసరదావన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని అందుకొన్నది. ఈ నేపథ్యంలో తమకు నష్టాలు రావడానికి కారణమైన శింబు రూ.20 కోట్లు చెల్లించాలని నడిగర సంఘానికి ఫిర్యాదు చేశారు.
అంబనవన్ అందగాదవన్ అసరదావన్ చిత్రం కోసం 60 రోజులు కాల్ షీట్స్ కేటాయించగా కేవలం 27 రోజులు మాత్రమే షూటింగ్కు వచ్చారు. దాని వల్ల మాకు తీవ్ర నష్టం జరిగింది అని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తమ ఫిర్యాదును సీరియస్గా తీసుకొని తమకు జరిగిన నష్టాన్ని ఇప్పించాలని, తమకు డబ్బులు ఇచ్చేంత వరకు శింబు మరే చిత్రంలో నటించకుండా ఆదేశించాలని నడిగర్ సంఘాన్ని వేడుకొన్నారు.
ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ప్రస్తుతం శింబు నటించిన నవాబు చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం సెప్టెంబర్ చివరి వారంలో రిలీజ్ కానున్నది. అలాగే అత్తారింటికి దారేది రీమేక్లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సుందర్ సీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం జార్జియాలో షూటింగ్ జరుపుకొంటున్నది.