Don't Miss!
- News పులివెందులలో జగన్ మెజార్టీ ఎంత - షర్మిల మంత్రాంగం..!!
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్పై కూర్చుకున్న వ్యక్తి వీడియో
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
శింబుపై కేసు నమోదు.. రూ.20 కోట్లు ఇప్పించాలని డిమాండ్
శింబు సహకరించకపోవడం వల్లే తాము తీవ్ర నష్టాలకు లోనయ్యామని నిర్మాత మైఖేల్ రాయప్పన్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో నిర్మాత మరింత ముందుకెళ్లి శింబుపై కేసు నమోదు చేశాడు. శింబుతో అధిక్ రవిచంద్రన్ రూపొందించిన అంబనవన్ అందగాదవన్ అసరదావన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని అందుకొన్నది. ఈ నేపథ్యంలో తమకు నష్టాలు రావడానికి కారణమైన శింబు రూ.20 కోట్లు చెల్లించాలని నడిగర సంఘానికి ఫిర్యాదు చేశారు.
అంబనవన్ అందగాదవన్ అసరదావన్ చిత్రం కోసం 60 రోజులు కాల్ షీట్స్ కేటాయించగా కేవలం 27 రోజులు మాత్రమే షూటింగ్కు వచ్చారు. దాని వల్ల మాకు తీవ్ర నష్టం జరిగింది అని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తమ ఫిర్యాదును సీరియస్గా తీసుకొని తమకు జరిగిన నష్టాన్ని ఇప్పించాలని, తమకు డబ్బులు ఇచ్చేంత వరకు శింబు మరే చిత్రంలో నటించకుండా ఆదేశించాలని నడిగర్ సంఘాన్ని వేడుకొన్నారు.
ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ప్రస్తుతం శింబు నటించిన నవాబు చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం సెప్టెంబర్ చివరి వారంలో రిలీజ్ కానున్నది. అలాగే అత్తారింటికి దారేది రీమేక్లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సుందర్ సీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం జార్జియాలో షూటింగ్ జరుపుకొంటున్నది.