Don't Miss!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- News అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మెగా డైరక్టర్ తమ్ముడు హీరోగా సినిమా ప్రారంభం
మురుగదాస్ మాట్లాడుతూ.. 'నేరాలనేవి గతంలో చాటుమాటుగా ఉండేవి. ప్రస్తుతం బహిరంగంగానే చోటుచేసుకుంటున్నాయి. దీన్ని ఇతివృత్తంగా తీసుకుని ఈ చిత్రం తెరకెక్కుతోంది. వరుసకు నా తమ్ముడైనందునే దిలీపన్ను హీరోగా ఎంచుకోలేదు. కథకు సరిగ్గా నప్పుతాడనే పేరు పరిశీలించారు. భయంకర సంఘటన హీరో జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పుతుంది? ఆపై అతని పయనం ఎటు సాగుతుందో అనే విషయాలను అత్యంత ఆసక్తికరంగా చూపించనున్నాం. ఈ నెల 13న ఆడియోను విడుదల చేసి, మార్చి 1న చిత్రాన్ని ప్రేక్షకుల చెంతకు తీసుకొస్తామని' చెప్పారు.
జర్నీ చిత్రం హిట్ సెంటిమెంట్తో అంజలిని ఈ చిత్రంలో హీరోయిన్గా ఎంపిక చేశారా? అన్న ప్రశ్నకు ఏఆర్ మురుగదాస్ బదులిస్తూ అలాంటిదేమీ లేదన్నారు. ఇకపోతే ఈ వత్తికుచ్చి చిత్రం హీరో కోసం చాలా మందిని పరిశీలించామన్నారు. చిత్రంలో ఆటో డ్రైవర్ అయిన హీరో పాత్రకు దిలీపన్ చక్కగా నప్పుతాడని భావించి ఎంపిక చేశామని తెలిపారు.
అదే విధంగా హీరోయిన్ పాత్రకు అంజలి కరెక్టుగా ఉంటుందనిఎంపిక చేశామన్నారు. హీరోయిన్ తరచూ హీరో ఆటోలో ప్రయాణించడం వల్ల వారి మధ్య ప్రేమ మొలకెత్తుతుందన్నారు. కథ విషయానికొస్తే సమాజంలో అన్యాయాలు, అక్రమాలు ప్రతి నిత్యం కళ్లముందే జరుగుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడం ఘోరమన్నారు. అలాంటి వాటిని ఎదిరించే యువకుడిగా వత్తికుచ్చి చిత్రంలో దిలీపన్ నటిస్తున్నారని తెలిపారు.
దర్శకుడు కింగ్స్టన్ పనితీరు సంతృప్తినిచ్చిందన్నారు. ఆయన కథ చెప్పిన దాని కంటే బెటర్గా తెరపై ఆవిష్కరిస్తున్నారని మురుగదాస్ తెలిపారు. ఈ సంచలన దర్శకుడు ప్రస్తుతం తుపాకీ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తూ బిజీగా ఉంటూ మరోపక్క సొం తంగా నిర్మిస్తున్న వత్తికుచ్చి నిర్మాణాన్ని పర్యవేక్షించడం విశేషం. అనంతరం ఆట్లీ దర్శకత్వంలో ఆర్య, నయనతార జంటగా నటించనున్న 'రాజారాణి' చిత్రాన్ని కూడా నిర్మించనున్నట్లు వెల్లడించారు. దర్శకత్వం విషయానికొస్తే హిందీలో తుప్పాక్కి రీమేక్తో బిజీగా ఉన్నానని మురుగదాస్ పేర్కొన్నాడు.