Don't Miss!
- News పురందేశ్వరికి చెక్ పెడుతోందెవరు - చంద్రబాబు ఎటువైపు..!?
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Automobiles టెస్లా, బీవైడీలకు పోటీగా Xiaomi SU7 ఎలక్ట్రిక్ కారు లాంచ్.. 810 కి.మీ రేంజ్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Finance CRAMC IPO: త్వరలో కెనరా రోబెకో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐపీఓ..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
చిరు డైరక్టరే ..సౌత్ లో టాప్ రెమ్యునేషన్
చిరంజీవితో స్టాలిన్ చిత్రం రూపొందించిన మురగదాస్ ఇప్పుడు సౌత్ లో ఎక్కువ రెమ్యునేషన్ తీసుకునే దర్శకుడుని చెప్తున్నారు. ఆయన తాజాగా విజయ్, కాజల్ దర్శకత్వంలో రూపొందే చిత్రం కోసం పన్నెండు కోట్లు డిమాండ్ చేయటం జరిగింది. దాంతో ఆ చిత్రాన్ని నిర్మించటానికి ముందుకొచ్చిన జెమిని వారు వెనక్కి తగ్గారు. అప్పుడు ఆ ప్రాజెక్టుని కలై పులి ధాను హ్యాండోవర్ చేసుకున్నాడు. ఇక ఈ చిత్రానికి తెలుగులో తుపాకి అనే టైటిల్ పెట్టారు. మురగదాస్ హిందీలో సైతం అమీర్ ఖాన్ ని డైరక్ట్ చేసి పెద్ద హిట్ కొట్టడంతో తన రెమ్యునేషన్ ని అమాంతం పెంచేసారు. సూర్యతో చేసిన సెవెంత్ సెన్స్ చిత్రానికి సైతం దాదాపు ఎనిమిది కోట్లు వరకూ రెమ్యునేషన్ తీసుకున్నట్లు చెన్నై వర్గాలు చెప్తున్నాయి.
సూర్య, శృతి హాసన్ కాంబినేషన్ లో వచ్చిన ఆ సైన్స్ ఫిక్షన్ చిత్రం భాక్సాఫీస్ వద్ద యావరేజ్ కావటంతో రెమ్యునేషన్ తగ్గిస్తాడని అంతా భావించారు. అయితే మురుగదాస్ మాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నట్లు చెప్తున్నారు. తమిళంలో 'మాళై నీరతు మళియతుల్లి" అనే టైటిల్ తో ఈ చిత్రం రూపొందనుంది. ఈ నెల 23న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ లాంఛనంగా ముంబైలో ప్రారంభం కానుంది. హేరీస్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ శివన్ ఛాయాగ్రాహణ బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. ఈ చిత్రాన్ని 2012లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శకుడు మురుగదాస్ సన్నాహాలు చేస్తున్నాడు.