Don't Miss!
- News barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క
- Sports IPL 2024: అందుకే పృథ్వీ షా ఆడటం లేదు: సౌరవ్ గంగూలీ
- Lifestyle గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కథ నచ్చలేదని అడ్వాన్స్ 5 కోట్లు వెనక్కి ఇచ్చేసి...
చెన్నై : 'సింగం 2' విజయం తర్వాత సూర్య నటిస్తున్న కొత్త చిత్రానికి లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. మొదట్లో గౌతం మీనన్ సినిమాలో నటించనున్నట్లు ప్రారంభంలో వార్తలు వినిపించాయి. అయితే ఆ సినిమా స్క్రిప్టు మారడంతో తప్పుకున్నాడు సూర్య. రూ.5 కోట్ల పారితోషికం కూడా తిరిగి ఇచ్చేసినట్లు సమాచారం.
లింగు స్వామితో అనుకున్న సినిమా ఆగిన వెంటనే లింగుస్వామి చిత్రంపై దృష్టిపెట్టాడు. ఈ సినిమా ప్రారంభ కార్యక్రమం ఇటీవల చెన్నైలో జరిగింది. రెండు భిన్నమైన పాత్రల్లో సూర్య కనిపించనున్నట్లు సమాచారం. ప్రపంచంలోనే తొలిసారిగా ఈ సినిమా కోసం రెడ్ డ్రాగన్ కెమెరాను వినియోగిస్తున్నామని కెమెరామెన్ సంతోష్శివన్ తెలిపారు. వచ్చే నెల ముంబయిలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఒక పాత్రలో సూర్య గడ్డంతో కనిపించనున్నట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి.
తమ కాంబినేషన్ లో రెండు హిట్స్ ఉండటంతో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయడానికి ముందుకొచ్చాడు సూర్య. అతని కథలన్నా, కథనమన్నా తనకిష్టమని, అందుకే ఆయన చిత్రంలో నటించడానికి ఒప్పుకుంటున్నానని అప్పట్లోచెప్పాడు. ఆ సినిమా కొన్నాళ్లు షూటింగ్ జరుపుకుని తరువాత నిరవధికంగా వాయిదా పడిపోయింది. ఆ సినిమా మళ్లీ ఎప్పుడు మొదలవుతుందో కూడా తెలియని పరిస్థితి. చివరికి అభిమానులు కూడా ఆ చిత్రాన్ని మర్చిపోయారు.
మళ్లీ కొంతకాలాని ఇద్దరి కాంబినేషన్లో 'ధృవనక్షత్రం' అన్న సినిమాను ప్రారంభిస్తారని ప్రకటించారు. ఆ చిత్రంలో తాను నటిస్తున్నానని సూర్య కూడా చెప్పాడు. కానీ దాదాపుగా ఆరునెలలైనా కథ తయారుకాలేదు. దీంతో విసుగు చెందిన సూర్య గౌతమ్మీనన్ దర్శకత్వంలో తాను నటించడం లేదని చెప్పేశారు. ఆరునెలలనుంచి గౌతమ్మీనన్ కథను కించిత్తు కూడా కదల్చలేకపోవడంతో, తనకు వేరే ప్రాజెక్టులు ఉండడంతో ఈ చిత్రాన్ని వదులుకుంటున్నానని ఆయన చెప్పడం విశేషం. గౌతమ్ మీనన్ మాత్రం ఈ విషయంపై నో కామెంట్ అన్న ధోరణితోనే ఉన్నాడు. మొత్తనికి ధృవనక్షత్రం సినిమా రెండు ధృవాలను విడగొట్టిందని కోలీవుడ్ అంటోంది.