Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
- News జగన్ కు వైఎస్ వివేకా భార్య లేఖ-అవినాష్, వైసీపీ అటాక్ పై-న్యాయంవైపు నిలబడాలని విన్నపం..!
- Finance Kotak Mahindra Bank: కొంపముంచిన కోటక్ మహీంద్రా బ్యాంక్.. భారీగా పడిపోయిన స్టాక్..!
- Technology ఆపిల్ తరహా డిజైన్తో నాయిస్ స్మార్ట్వాచ్.. 1.85 అంగుళాల డిస్ప్లే, 7 రోజుల బ్యాటరీ లైఫ్తో విడుదల
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'సింహా' తర్వాత నమిత కమిటయిన కొత్త చిత్రం
బాలకృష్ణ సరసన నటించిన 'సింహా' ఘన విజయం సాధించటంతో నమిత చాలా ఉషారుగా ఉంది. ఈ చిత్రానికి ముందు కొంతకాలంగా ఆమె నటించిన సినిమాలన్నీ నిరాశపరచాయి. హిట్టుకు మొహం వాచిన ఆమెకు ఈ చిత్రం కిక్ ఇచ్చింది. దాంతో ఇటీవల మీడియాకు దూరంగా ఉంటూ వచ్చిన ఆమె మళ్ళీ మీడియాను కలిసి తన లేటెస్ట్ చిత్ర విశేషాలను వివరించింది. ఆమె చెప్పిన దాని ప్రకారం ఆమె తాజాగా కమిటయిన తమిళ చిత్రం ఇళంజన్. దానికి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి కథ, కథనం సమకూర్చారు. గీత రచయిత పా.విజయ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయనకు జంటగా రమ్యా నంబిశన్ నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సురేష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే సురేష్ కృష్ణుకు ఈ చిత్రం ఆయన 50వ చిత్రం కావడం విశేషం. ఇక నమిత ఈ చిత్రం గురించి మాట్లాడుతూ..ఈ చిత్రంలో నటించడం గురించి నమిత మాట్లాడుతూ ఇళంజన్ చిత్రంలో నటించే అవకాశం రావడం చాలా థ్రిల్లింగ్ గా ఫీలవుతున్నాను. ఇందులో నాది కీలకపాత్ర. అలాగే ఈ పాత్రను ఒప్పుకోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. చిత్ర కథ, కథనం, సంభాషణలు ముఖ్యమంత్రి కరుణానిధి అందించడం, దర్శకుడు సురేష్ కృష్ణకు 50వ చిత్రం కావడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చానను. అలాగే త్వరలో సొంతంగా ఒక చిత్రాన్ని నిర్మించనున్నట్లు ఆమె చెప్పింది.