twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నమితతో.. రాజా!!?

    By Staff
    |

    Namitha
    వరస పరాజయాలని ఎదుర్కొంటున్న రాజా ఇప్పుడో జానపద చిత్రంలో నమిత ప్రక్కన చేస్తున్నాడని వార్తలు వినవస్తున్నాయి. ఆ చిత్రం మరేదో కాదు...అప్పట్లో అంటే ఎనభైల్లో సంచలనం సృష్టించిన 'జగన్మోహిని' రీమేక్.జయమాలిని,నరసింహరాజు జంటగా బి.విఠలాచార్య దర్శకత్వంలో రూపొందిన జానపద చిత్రం జగన్మోహిని అప్పట్లో సంచలనం సృష్టించి కలక్షన్స్ వర్షం కురిపించింది. నిజానికి మాయలు,మంత్రాలు,ఎక్స్ పోజింగ్,అన్నీ కలిసిన మసాలా గా చక్కని ట్రీట్ గా ఉండే ఆ సినిమాని మర్చిపోయేవారుండరు.

    దాంతో ఇప్పుడా మ్యాజిక్ రిపీట్ చేసి సొమ్ము చేసుకోవాలని కొంతమంది నిర్మాతలు భావించి ఆ సినిమాని మళ్ళీ రీమేక్ చేస్తున్నారు. తమిళ తెలుగు భాషల్లో రెడీ అయ్యే ఆ చిత్రంలో భారీ అందాల నమిత జగన్మోహిని గా కనిపించనుంది. లక్ష్మీ మూవీమేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి యన్.కె.విశ్వనాధన్ దర్శకత్వం వహించనున్నాడు. దానికోసం మొదట పృధ్వీ రాజుని అడిగారుట. కానీ అతను మణిరత్నం సినిమాకు డేట్స్ ఇచ్చి ఉండటంతో నొ అన్నడట. మరి ఖాళీగా ఉన్న వెల్ నోన్ ఫేస్ యేదని ఎంక్వైరీ చేస్తే రాజా వెలిగాడుట. అంతే అందాల నమిత ప్రక్కన బుక్కయ్యాడు. అదీ సంగతి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X