Don't Miss!
- News ఎన్నికల వేళ కోర్టుల్ని ప్రభావితం చేసే కుట్ర ! సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ-మోడీ కౌంటర్
- Automobiles ఇలా చేయడం కరెక్టేనా? తప్పో.. ఒప్పో మీరే చెప్పాలి - వీడియో
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
‘అరవింద సమేత’ తర్వాత.. మరోసారి విలన్గా నవీన్ చంద్ర, ఏ హీరో మూవీ అంటే?
'అందాల రాక్షసి' మూవీతో హీరోగా ఇండస్ట్రీలో తన ప్రయాణం మొదలుపెట్టిన నవీన్ చంద్ర అన్ని రకాల పాత్రలు చేసుకుంటూ దూసుకెళుతున్నాడు. త్రివిక్రమ్, జూ ఎన్టీఆర్ కలయికలో వచ్చిన అరవింద సమేత వీరరాఘవలో విలన్ పాత్రలో మెప్పించిన నవీన్, త్వరలో తమిళ హీరో ధనుస్ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర చేయబోతున్నాడు. ధనుష్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాను సత్యజ్యోతి ఫిల్మ్స్ నిర్మిస్తుండగా, దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ధనుష్ మూవీలో నటించడంపై నవీన్ చంద్ర మాట్లాడుతూ.. ''ధనుష్తో నటిస్తోన్న మొదటి సినిమా ఇది. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ధనుష్ ఓ గొప్ప నటుడు. తన పనేదో తను చూసుకుంటాడు. కూల్ అండ్ కామ్ గోయింగ్ స్టార్. మే నెల నుంచి రెండో షెడ్యూల్ కు వెళ్లబోతున్నాం. ఈ షెడ్యూల్ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. నా పాత్రలోనే కాదు.. బాడీలోనూ చాలా మార్పులు ఉంటాయి.'' అన్నారు.
దర్శకుడు దురై సెంథిల్ కుమార్ వంటి ప్రతిభావంతుడైన టెక్నీషియన్తో పాటు ఇంత హార్డ్ వర్కింగ్ టీమ్తో పనిచేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని నవీన్ చంద్ర తెలిపారు. దురై సెంథిల్ కుమార్ గతంలో ధనుష్ హీరోగా కోడి(తెలుగులో ధర్మయోగి) సినిమా చేశారు.
స్నేహ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఓమ్ ప్రకాష్, పోరాట దృశ్యాలను దిలీప్ సుబ్బరాజ్ కంపోజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో నవీన్ చంద్ర కోలీవుడ్లో కూడా బిజీ కావడం ఖాయం అనే టాక్ ఉంది.