Don't Miss!
- News జపాన్ను వణికించిన భూకంపం
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
‘అరవింద సమేత’ తర్వాత.. మరోసారి విలన్గా నవీన్ చంద్ర, ఏ హీరో మూవీ అంటే?
'అందాల రాక్షసి' మూవీతో హీరోగా ఇండస్ట్రీలో తన ప్రయాణం మొదలుపెట్టిన నవీన్ చంద్ర అన్ని రకాల పాత్రలు చేసుకుంటూ దూసుకెళుతున్నాడు. త్రివిక్రమ్, జూ ఎన్టీఆర్ కలయికలో వచ్చిన అరవింద సమేత వీరరాఘవలో విలన్ పాత్రలో మెప్పించిన నవీన్, త్వరలో తమిళ హీరో ధనుస్ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర చేయబోతున్నాడు. ధనుష్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాను సత్యజ్యోతి ఫిల్మ్స్ నిర్మిస్తుండగా, దురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ధనుష్ మూవీలో నటించడంపై నవీన్ చంద్ర మాట్లాడుతూ.. ''ధనుష్తో నటిస్తోన్న మొదటి సినిమా ఇది. ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ధనుష్ ఓ గొప్ప నటుడు. తన పనేదో తను చూసుకుంటాడు. కూల్ అండ్ కామ్ గోయింగ్ స్టార్. మే నెల నుంచి రెండో షెడ్యూల్ కు వెళ్లబోతున్నాం. ఈ షెడ్యూల్ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. నా పాత్రలోనే కాదు.. బాడీలోనూ చాలా మార్పులు ఉంటాయి.'' అన్నారు.
దర్శకుడు దురై సెంథిల్ కుమార్ వంటి ప్రతిభావంతుడైన టెక్నీషియన్తో పాటు ఇంత హార్డ్ వర్కింగ్ టీమ్తో పనిచేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని నవీన్ చంద్ర తెలిపారు. దురై సెంథిల్ కుమార్ గతంలో ధనుష్ హీరోగా కోడి(తెలుగులో ధర్మయోగి) సినిమా చేశారు.
స్నేహ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఓమ్ ప్రకాష్, పోరాట దృశ్యాలను దిలీప్ సుబ్బరాజ్ కంపోజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో నవీన్ చంద్ర కోలీవుడ్లో కూడా బిజీ కావడం ఖాయం అనే టాక్ ఉంది.