Don't Miss!
- News అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ: బారులు తీరిన ఓటర్లు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆ ఇద్దరు హీరోలతో మనశ్శాంతిని కోల్సోయాను...
'సినిమాల్లోకొచ్చాక బోలడ్డన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాను..లెక్కలేనంత డబ్బూ సంపాదించాను.. మనశ్శాంతి కోల్సోయాను.."అంటూ నయనతార ఆవేదన చెందారు. నాకే ఎందుకు ఇలా జరగుతోందో అర్థం కావడంలేదు.." అంటూ ఈ మద్యన ఓ చానెల్ ఇటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
మొదట శింబుని ఇష్టపడ్డాను..హ్యాండిచ్చాడు..ఐతే పోన్లే లవ్ ఫెయిల్యూర్..అని గుండె దిటవు చేసుకుందామనుకుంటే, ఎంతగా నన్ను అప్రతిష్టపాల్జేయాలో అంతగా శింబు నా జీవితాన్ని రచ్చకీడ్చాడు" అంటూ నయనతార కన్నీరు మున్నీరయ్యింది. ఇక ప్రభదేవాతో ప్రేమాయణం కూడా తనకు కలిసి రాలేదని చెబుతోన్న నయనతార, ప్రేమ విషయంలో తాను పూర్తిగా ఫెయిలయ్యానని ఒప్పేసుకుంది. మళ్ళీ ఇకపై ప్రేమలో పడ్డం, ఇబ్బందులు కొనితెచ్చుకోవడం చేయననీ, పూర్తిగా కేరీర్ పైనే దృష్టిపెడ్తాననీ, కెరీర్ లోనే ఆనందం వెతుక్కుంటానని నయనతార స్పష్టం చేసింది. మరి ఈ డెసిషన్ కి ఇకనైనా నయనతార కట్టుబడి వుంటుందా?అదే గనుక జరిగితే మొదటి భార్య తో గొడవ పెట్టుకున్న ప్రభుదేవా పరిస్థితి ఏంటి..?