Don't Miss!
- Sports PBKS vs MI: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ!
- News ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
నయనతార ఏడుపు అందుకే...
మొగుడు కొట్టినందుకు కాదు తోడుకోడలు నవ్వినందుకు నా ఏడుపు అన్నట్లు తయారైంది నయనతార పరిస్ధితి అంటున్నారు. ఆమె తల్లితండ్రులు ఆమెకు ఆంక్షలు విధించటం కన్నా మీడియాలో ఈ వార్తలు రావటం ఆమెకు బాధ కలిగిస్తోందని ఆమె సన్నిహితులు చెప్తున్నారు. ఈ విషయంపై ఆమె ఘాటుగానే స్పందిస్తోంది. నాపై మా ఇంట్లో వాళ్ళకు నమ్మకం ఎక్కువ. నన్ను కాపలా కాసే అవసరం వాళ్ళకెందుకు? అంటూ ప్రశ్నిస్తోంది నయనతార.
నయతార, ప్రభుదేవా ప్రేమ వ్యవహారం పై సీరియస్ అయిన నయనతార తల్లి తండ్రులు ఆమెకు కాపలాగా ఆమె అన్నను షూటింగ్ లకు పంపుతున్న సంగతి తెలిసిందే. అలాగే పరిస్ధితిని బట్టి ఆమె వెంటే వారు కూడా వెళ్తున్నారనీ, షూటింగ్ దగ్గర కూడా కూర్చొంటున్నారనీ తెలిసింది. అంతవరకూ బాగానే ఉన్నా ఈ విషయం మీడియాలో రావటంతో ఆమె సీరియస్ అయ్యింది.
హీరోయిన్స్ తల్లితండ్రులు సెట్లో ఉండటం సాధారణ విషయమే. కానీ మా వాళ్ళు అలా కాదు. నన్ను నమ్మి నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ఒక వేళ నేను ఎవరికైనా సమాధానం చెప్పవలసొస్తే అది వాళ్ళకు మాత్రమే అని చెప్పింది..అంతేగాక పనిలో పనిగా మీడియా పైనా విరుచుకుపడింది. నాపై రాసే ముందు ఒక్క క్షణం నిజం ఏమిటో తెలుసుకుంటే మంచిది. ఇలా లేనిపోని కబుర్లు రాసేయడం ఎందుకు? అంటోంది. ఇదంతా కరెక్టే గానీ ఇన్నాళ్ళు స్వేఛ్చగా తిరిగిన ఆమెను ఇలా కట్టుదిట్టం చేస్తే ఇబ్బందే కదా అందుకే ఆమె మండిపాటు అని సాటివారు అంటున్నారు.